PM Modi: యుద్ధం నుంచి యుద్ధవిరమణ దిశగా సాగాలి.. పుతిన్తో భేటీలో మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలకాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్రపంచ శాంతి, మానవాళి సంక్షేమం కోసం యుద్ధానికి బదులుగా శాంతియుత పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్కు వెళ్లిన మోదీ.. సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యారు.
వివరాలు
యుద్ధవిరమణ దిశగా పయనించాలి.. మానవాళి సంక్షేమానికి ఇది ఎంతో అవసరం
''యుద్ధం కొనసాగే ప్రతి రోజు మానవాళిని మరింత వెనక్కి తీసుకెళ్తుంది. అదే సమయంలో శాంతి కోసం వేసే ప్రతి అడుగు ప్రజల్లో కొత్త ఆశలు, ఉత్సాహాన్ని నింపుతుంది. అంతులేని యుద్ధం నుంచి యుద్ధవిరమణ దిశగా పయనించాలి. మానవాళి సంక్షేమానికి ఇది ఎంతో అవసరం. అన్ని సమస్యలకు శాంతియుత పరిష్కారం లభించాలన్నదే భారత్ సందేశం. మహాత్మాగాంధీ, గౌతమ బుద్ధుడు నడయాడిన భారతదేశం ఎప్పుడూ శాంతి ప్రయత్నాలకు అండగా నిలిచింది. ఇకముందూ అదే విధానాన్ని కొనసాగిస్తుంది. మా మార్గం ఎప్పటికీ శాంతిదే'' అని మోదీ పేర్కొన్నారు.
వివరాలు
దేశ ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన వివిధ అంశాలపై తాము గతంలోనూ చర్చించిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
గత ఏడాది పుతిన్ భారత్లో పర్యటించిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ఆ పర్యటన ఎంతో గుర్తుండిపోయేలా సాగిందన్నారు.
ఇరు దేశాల మధ్య సహకారం కొత్త స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.
భారత్, రష్యా ప్రజల సంక్షేమం కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని, దేశ ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.
భవిష్యత్తులోనూ ఇదే తమ సంబంధాలకు దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు.
వివరాలు
ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం
వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, ఎరువుల సరఫరా తదితర రంగాల్లో భారత్-రష్యా మధ్య కొనసాగుతున్న సహకారంపైనా మోదీ, పుతిన్ చర్చించారు.
ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలను కూడా సమీక్షించారు.
బిష్కెక్లోని మహాత్మాగాంధీ స్మారకాన్ని మోదీ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.
నోమడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పుతిన్తో కలిసి మోదీ కారులో ప్రయాణించారు.
వివరాలు
ఉజ్బెక్ విద్యార్థుల నోట మోదీ పద్యాలు
భారత ప్రధాని నరేంద్రమోదీ రచించిన పద్యాలు ఉజ్బెక్ విద్యార్థుల నోట మార్మోగాయి.
'అభీ తో సూరజ్ ఉగా హై', 'నయే భారత్ కే నయే సంకల్ప్', 'మానవతా కో కహీ న లగ్ జాయే దాగ్' వంటి ఆయన రచనలను విద్యార్థులు హిందీతో పాటు ఉజ్బెక్ భాషలోనూ ఆలపించారు.
ఉజ్బెక్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఏర్పాటు చేసిన విందు సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
వివరాలు
పశ్చిమాసియాలో శాంతి కోసం భారత్ పిలుపు
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తోనూ మోదీ సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత నెలకొనాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలు కొనసాగడం, పౌరుల హక్కులు, వారికి అవసరమైన సదుపాయాలను కాపాడటం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో ఇరాన్తో వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు భారత్ ఆసక్తిగా ఉందని మోదీ తెలిపారు.
శాంతి, భద్రతల కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. దౌత్యపరమైన మార్గాలను పక్కనపెట్టి అమెరికా యుద్ధ మార్గాన్ని ఎంచుకుందని పెజెష్కియాన్ చెప్పారు.
వివరాలు
పశ్చిమాసియాలో శాంతి కోసం భారత్ పిలుపు
తమ దేశ ప్రజలను ముప్పు నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఇరాన్పై ఉందన్నారు.
యుద్ధం, రక్తపాతం నుంచి చర్చలు, ఒప్పందాల దిశగా పరిస్థితులను మళ్లించేందుకు భారత్కు ఉన్న విస్తృత అంతర్జాతీయ సంబంధాలను వినియోగించాలని మోదీని కోరారు.
యుద్ధం కొనసాగడం వల్ల ఏ దేశానికీ ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.
కిర్గిజ్ అధ్యక్షుడు ఝపరోవ్తోనూ మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.