NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Traffic Offenders: గీత దాటారో.. లైసెన్సు గోవిందా!; ట్రాఫిక్ ఉల్లంఘనలకు పెనాల్టీ పాయింట్లు; కొత్త వ్యవస్థను అమలులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం  
    తదుపరి వార్తా కథనం
    Traffic Offenders: గీత దాటారో.. లైసెన్సు గోవిందా!; ట్రాఫిక్ ఉల్లంఘనలకు పెనాల్టీ పాయింట్లు; కొత్త వ్యవస్థను అమలులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం  
    గీత దాటారో.. లైసెన్సు గోవిందా!; ట్రాఫిక్ ఉల్లంఘనలకు పెనాల్టీ పాయింట్లు

    Traffic Offenders: గీత దాటారో.. లైసెన్సు గోవిందా!; ట్రాఫిక్ ఉల్లంఘనలకు పెనాల్టీ పాయింట్లు; కొత్త వ్యవస్థను అమలులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం  

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 05, 2025
    05:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్తగా పాయింట్ల ఆధారిత వ్యవస్థను తీసుకురానున్నారు.

    ఇది రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు తొలి ప్రయత్నంగా దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు.

    ఈ విధానం కింద,ఒక వాహనదారుడు ఉల్లంఘనల వల్ల మొత్తం 12 పాయింట్లు చేరితే,అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను ఒక సంవత్సరం పాటు రద్దు చేస్తారు.

    అదే వ్యక్తి రెండు సంవత్సరాల్లో మళ్లీ 12 పాయింట్లు సాధించితే, లైసెన్స్‌ను మరో రెండేళ్ల పాటు సస్పెండ్‌ చేస్తారు.

    ఇది మూడోసారి జరిగితే, ప్రతి సారి మూడు సంవత్సరాల పాటు లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తారు.

    ఇక లెర్నింగ్ లైసెన్స్ కలిగిన వారి విషయంలో 5 పాయింట్లకు మించి ఉల్లంఘనలు నమోదైతే,వారి లైసెన్స్‌ను వెంటనే రద్దు చేయనున్నారు.

    అనర్హత 

    ఐదేళ్ల వరకు అనర్హత 

    పదే పదే ఈ రూల్ ని ఉల్లఘించే వారిని ఐదేళ్ల వరకు అనర్హులుగా ప్రకటించవచ్చు.

    ఈ వ్యవస్థ UK, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలనుండి ప్రేరణ పొందింది. ఈ వ్యవస్థను రెండు నెలల్లో చట్టంగా అమలు చేయచ్చని భావిస్తున్నారు.

    గతంలో ఉల్లంఘనలు జరిగితే లైసెన్స్ పునరుద్ధరణకు తప్పనిసరి డ్రైవింగ్ పరీక్షలు, మూడు నెలల కంటే ఎక్కువ పాతది అయిన చెల్లించని ఈ-చలాన్ల లైసెన్స్‌లను సస్పెండ్ చేసే నిబంధనలు ఉన్నాయి.

    ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి AI వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించాలని నిర్ణయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    కేంద్ర ప్రభుత్వం

    8th Pay Commission : 8వ వేతన సంఘం అప్‌డేట్..50 లక్షల మంది ఉద్యోగులకు లాభం ఇండియా
    Waqf bill: రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ బిల్లు రాజ్యసభ
    Sheeshmahal: ఢిల్లీ 'శీష్ మహల్‌'పై విచారణకు ఆదేశించిన కేంద్రం దిల్లీ
    Horticulture: ఉద్యాన పంటలకు కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025