Loading...
E20 fuel: E20 ఫ్యూయల్‌పై మెర్సిడెస్‌ కీలక ప్రకటన.. వినియోగదారులకు భరోసా
E20 ఫ్యూయల్‌పై మెర్సిడెస్‌ కీలక ప్రకటన.. వినియోగదారులకు భరోసా

E20 fuel: E20 ఫ్యూయల్‌పై మెర్సిడెస్‌ కీలక ప్రకటన.. వినియోగదారులకు భరోసా

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో E20(20 శాతం ఎథనాల్ మిశ్రమం ఉన్నపెట్రోల్)పై వివాదం కొనసాగుతున్న వేళ ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అధికారికంగా స్పందించింది. తమ అన్ని BS6 పెట్రోల్ కార్లు E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా ఉంటాయని,సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమైన ధ్రువీకరణ కూడా పొందాయని కంపెనీ వెల్లడించింది. "వినియోగదారుల భద్రత,వాహనాల విశ్వసనీయత,పనితీరు మా సంస్థకు అత్యంత ముఖ్యమైనవి. మా అన్ని BS6పెట్రోల్ వాహనాలు E20ఇంధనానికి అనుకూలంగా రూపొందించబడ్డాయి. దీనికి సంబంధించిన అన్ని అధికారిక ప్రమాణాలను కూడా అవి పూర్తి చేశాయి. వినియోగదారులకు ఏవైనా సాంకేతిక సందేహాలు ఉంటే సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్థిరమైన రవాణా వ్యవస్థకు మా కట్టుబాటు కొనసాగుతుంది"అని మెర్సిడెస్-బెంజ్ తన ప్రకటనలో తెలిపింది.

వివరాలు 

భవిష్యత్ నిబంధనలకు అనుగుణంగా సిద్దమైన కంపెనీ 

ఇటీవల BMW గ్రూప్ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ హర్‌దీప్ సింగ్ బ్రార్ కూడా ఇదే అంశంపై స్పందించారు.

తమ పెట్రోల్ కార్లు ఇప్పటికే E25 వరకు ఎథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించగలిగేలా సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

భవిష్యత్ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ ముందుగానే సన్నద్ధమైందని చెప్పారు.

భారత మార్కెట్లో విక్రయిస్తున్న BMW పెట్రోల్,డీజిల్ వాహనాలు ప్రస్తుత భారత ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని బ్రార్ వెల్లడించారు.

అలాగే కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు,అంతర్గత దహన ఇంజిన్లు,హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికత వంటి అన్ని రంగాల్లో పెట్టుబడులు కొనసాగిస్తోందని వివరించారు.

వివరాలు 

E20పై ఎందుకు వివాదం?

ఎథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల సాధారణ శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుందని, దేశ ఇంధన భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

దేశంలో E20 ఇంధనాన్ని వేగంగా అమలు చేయడంపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం E20ను ప్రామాణిక పెట్రోల్‌గా తీసుకురావడంతో పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంశంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) కూడా దాఖలైంది.

చాలా మంది వాహనదారులు E20 వాడిన తర్వాత మైలేజ్ గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు.

కొన్ని స్వతంత్ర సర్వేల ప్రకారం దాదాపు 66 శాతం మంది వినియోగదారులు 10 శాతానికి మించి మైలేజ్ తగ్గిందని వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

E20పై ఎందుకు వివాదం?

పాత వాహనాల్లో ఎథనాల్ కారణంగా ఇంజిన్ భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

ఇతర దేశాల మాదిరిగా తక్కువ ఎథనాల్ మిశ్రమం ఉన్న పెట్రోల్ అందుబాటులో లేకపోవడం కూడా విమర్శలకు దారితీస్తోంది.

E20కు అనుకూలం కాని పాత వాహనాల్లో ఇంజిన్ దెబ్బతింటే బీమా కంపెనీలు క్లెయిమ్‌లను తిరస్కరించే అవకాశం ఉందనే భయం కూడా వినియోగదారుల్లో ఉంది.

అంతేకాకుండా ఎథనాల్‌లో శక్తి విలువ తక్కువగా ఉన్నప్పటికీ, అదే ధరకు పెట్రోల్ విక్రయిస్తున్నారని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ విశ్లేషకుడు తహ్‌సీన్ పూనావాలా మాట్లాడుతూ, "దేశానికి మేలు జరిగేలా, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా సరైన విధానాన్ని ప్రభుత్వం తీసుకురావాలి" అన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

E20పై ఎందుకు వివాదం?

అలాగే, "చెరకు రైతుకు కిలోకు రూ.3.65 మాత్రమే లభిస్తుండగా, ఎథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను రూ.102కు విక్రయిస్తున్నారు. మధ్యలో వచ్చే లాభం విధానాలు రూపొందించే వారికి చెందిన డిస్టిలరీలకు వెళ్తోందనే విమర్శలు ఉన్నాయి. కుటుంబ ప్రయోజనాల కోసం విధానాలు రూపొందించకూడదు" అని వ్యాఖ్యానించారు.

వివరాలు 

ప్రభుత్వ వాదన ఇదే..

E20 విధానాన్ని ప్రభుత్వం అధికారిక FAQ పత్రం ద్వారా సమర్థిస్తోంది.

ఎథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల భారత్‌కు విదేశీ మారక ద్రవ్యంగా సుమారు రూ.1.97లక్షల కోట్లు ఆదా అయ్యాయని ప్రభుత్వం చెబుతోంది.

అలాగే రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రూ.1.66లక్షల కోట్లకు పైగా ప్రయోజనం చేకూరిందని పేర్కొంటోంది.

E20 వల్ల జీవితకాల కార్బన్ ఉద్గారాలు సుమారు 40శాతం వరకు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.

వివరాలు 

ప్రభుత్వ వాదన ఇదే..

విస్తృత పరీక్షల అనంతరం పెద్ద ఎత్తున యాంత్రిక సమస్యలు గుర్తించలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎథనాల్ మిశ్రమ ఇంధనంలో ఆక్టేన్ విలువ ఎక్కువగా ఉండటంతో ఇంజిన్‌లో ఇంధనం మరింత సమర్థంగా మండుతుందని, దీంతో యాక్సిలరేషన్ కూడా మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు.

రైతులకు హామీతో కొనుగోలు చేసే విధానం కారణంగానే ధరల్లో తేడా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

ADVERTISEMENT