Loading...
8th Pay Commission: 8వ పే కమిషన్‌పై కేంద్రం కీలక ప్రకటన.. ఫలాల కోసం మరికొంత కాలం ఆగాల్సిందే..
ఫలాల కోసం మరికొంత కాలం ఆగాల్సిందే..

8th Pay Commission: 8వ పే కమిషన్‌పై కేంద్రం కీలక ప్రకటన.. ఫలాల కోసం మరికొంత కాలం ఆగాల్సిందే..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2026
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. కమిషన్ ఇప్పటివరకు తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదని ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు వెల్లడించింది. ప్రస్తుతం నివేదిక తయారీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని.. ఈ దశలో సిఫార్సులపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం సాధ్యం కాదని తెలిపింది.

వివరాలు 

2025 నవంబర్ 3న ఏర్పాటు

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన 2025 నవంబర్ 3న 8వ వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

తన సిఫార్సులను సమర్పించేందుకు కమిషన్‌కు మొత్తం 18 నెలల సమయం ఇచ్చారు. ఈ గడువు ప్రకారం 2027 మే నాటికి 8వ వేతన సంఘం తుది నివేదికను సమర్పించే అవకాశం ఉంది.

అయితే, అవసరమని భావిస్తే అంతకంటే ముందే ఏదైనా అంశానికి సంబంధించి మధ్యంతర నివేదికను అందించే అవకాశం కూడా కమిషన్‌కు ఉంది.

వివరాలు 

ఉద్యోగ,పెన్షనర్ల సంఘాలతో సంప్రదింపులు

ప్రస్తుతం 8వ వేతన సంఘం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది.

ఇప్పటికే ఢిల్లీలో సంప్రదింపుల కార్యక్రమం పూర్తయింది. తదుపరి దశలో జైపూర్, చెన్నై, పుదుచ్చేరి, చండీగఢ్ నగరాల్లో సమావేశాలు నిర్వహించనుంది.

ఈ చర్చల్లో భాగంగా ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లు, సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాయి.

ఉదాహరణకు, ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (IRTSA) కీలక ప్రతిపాదన చేసింది.

కనీస వేతనాన్ని రూ.52,600గా నిర్ణయించాలని, 2.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయాలని కమిషన్‌ను కోరింది.

ఇలాంటి డిమాండ్లపై ఉద్యోగ సంఘాల నుంచి మరిన్ని ప్రతిపాదనలు కూడా కమిషన్‌కు అందుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

68 లక్షల మందికి పైగా ఎదురుచూపులు

8వ వేతన సంఘం సిఫార్సులపై దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సుమారు 35.77 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 33.76 లక్షల మంది పెన్షనర్లు ఈ నివేదికపై ఆశలు పెట్టుకున్నారు.

కొత్త వేతన విధానం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, వివిధ అలవెన్సుల్లో మార్పులు తమ ఆదాయంపై ప్రభావం చూపుతాయని వారు భావిస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ఈ అంశాల్లో ఏదిపైనా కమిషన్ తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది.

ముఖ్యంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి, కనీస వేతనాన్ని ఏ స్థాయిలో నిర్ణయించాలి, అలవెన్సుల్లో ఎలాంటి మార్పులు చేయాలనే విషయాలపై ఇంకా సిఫార్సులు ఖరారు కాలేదు.

ADVERTISEMENT

వివరాలు 

సంప్రదింపులు పూర్తయిన తర్వాతే తుది సిఫార్సులు

దేశవ్యాప్తంగా ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే వివిధ అంశాలను పరిశీలించి 8వ వేతన సంఘం తుది సిఫార్సులను రూపొందించనుంది.

ఆ తర్వాతే నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరనుంది. ఈ నేపథ్యంలో 8వ పే కమిషన్ ద్వారా వేతనాలు, పెన్షన్లలో మార్పులు వస్తాయని ఆశిస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2027 మే వరకు ఉన్న గడువును దృష్టిలో పెట్టుకుంటే తుది ఫలితాల కోసం ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

ADVERTISEMENT