LOADING...
Anil Ambani: ఈడీ విచారణకు మళ్లీ అనిల్ అంబానీ డుమ్మా!
ఈడీ విచారణకు మళ్లీ అనిల్ అంబానీ డుమ్మా!

Anil Ambani: ఈడీ విచారణకు మళ్లీ అనిల్ అంబానీ డుమ్మా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2025
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయెన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరు కాలేదు. ఫెమా కేసులో నవంబర్ 14న ఆయన హాజరవాల్సి ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా రాకపోవడం గమనార్హం. ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అవ్వదలచుకున్నప్పటికీ, ED ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీనికి సంబంధించి, ED నవంబర్ 17న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని రెండోసారి సమన్లు జారీ చేసింది. అయితే, సోమవారం కూడా అనిల్ అంబానీ హాజరుకాకపోవడంతో, మరలా సమన్లు జారీ చేస్తారా లేదా అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు.

Details

సుమారు పది గంటల పాటు విచారణ

ఈ దారుణ కేసు బ్యాంకు మోసం, మనీ లాండరింగ్‌కు సంబంధించి ఉంది. ఆగస్టులో ఇదే కేసులో ED అనిల్ అంబానీని సుమారు 10 గంటలపాటు విచారించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SB) నుంచి రూ. 2,929 కోట్ల రుణం తీసుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (RCom) మనీ లాండరింగ్ కేసులో భాగం అని ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టు 21న కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) నమోదు చేసిన FIR ఆధారంగా ED విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే ముంబైలోని అంబానీ నివాసం సహా పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది.