NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Domestic air traffic: 2024లో 16.13 కోట్లకు పెరిగిన భారత దేశీయ విమాన ట్రాఫిక్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Domestic air traffic: 2024లో 16.13 కోట్లకు పెరిగిన భారత దేశీయ విమాన ట్రాఫిక్ 
    2024లో 16.13 కోట్లకు పెరిగిన భారత దేశీయ విమాన ట్రాఫిక్

    Domestic air traffic: 2024లో 16.13 కోట్లకు పెరిగిన భారత దేశీయ విమాన ట్రాఫిక్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 23, 2025
    10:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో 2024లో దేశీయ విమాన ట్రాఫిక్ (Domestic Air Traffic) గణనీయంగా పెరిగింది.

    మొత్తం 16.13 కోట్ల మంది ప్రయాణీకులు ఏటా విమానాల్లో ప్రయాణించి, రికార్డు నెలకొల్పారు.

    ఇది ఏడాది ప్రాతిపదికన 6 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

    ఈ పెరుగుదల, వేగంగా విస్తరిస్తున్న ఏవియేషన్ మార్కెట్‌ను ప్రతిబింబిస్తుంది.

    డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ద్వారా వెల్లడించబడిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

    వివరాలు 

    అగ్రస్థానంలో ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ (OTP)తో  ఇండిగో 

    2024 డిసెంబర్‌లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 1.49 కోట్లకు చేరుకుంది, ఇది 2023 డిసెంబర్‌తో పోలిస్తే 8.19% పెరుగుదల.

    ఇండిగో 64.4% మార్కెట్ వాటాతో ఆధిపత్యం కొనసాగిస్తుండగా, ఎయిర్ ఇండియా 26.4% వాటాతో రెండో స్థానంలో ఉంది.

    అకాసా ఎయిర్, స్పైస్ జెట్ 4.6% మరియు 3.3% వాటాతో వరుసగా ఉన్నాయ్.

    ఇండిగో 73.4% ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ (OTP)తో అగ్రస్థానంలో నిలిచి, ఎయిరిండియా 67.6% OTPతో రెండో స్థానంలో నిలిచింది.

    అయితే, విమానాల రద్దు, ఆలస్యం కారణంగా డిసెంబరులో మొత్తం OTP ప్రభావితం అయింది.

    మొత్తం విమానాల రద్దు రేటు 1.07%గా ఉంది, ఇది 67,622 మంది ప్రయాణీకులపై ప్రభావం చూపింది.

    వివరాలు 

    విమానాల ఆలస్యం 2,79,985 మంది ప్రయాణీకులపై ప్రభావం 

    ఈ రద్దులకు పరిహారం,సౌకర్యాల కోసం విమానయాన సంస్థలు రూ.1.26కోట్లు ఖర్చు చేశాయి.

    విమానాల ఆలస్యం 2,79,985 మంది ప్రయాణీకులను ప్రభావితం చేసింది,వీరిపై సౌకర్యాల కోసం సంస్థలు రూ.3.78 కోట్లు ఖర్చు చేశాయి.

    2,147 మంది ప్రయాణీకులకు బోర్డింగ్ నిరాకరించబడింది,వీరికి పరిహారం కోసం రూ.1.76 కోట్లు చెల్లించబడింది.

    కొవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి విమానయాన రంగం క్రమంగా కోలుకుంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు విమానయాన సంస్థలు తమ విమానాల సంఖ్య, నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్నాయి.

    భారత ఆర్థిక వృద్ధి కూడా విమాన ప్రయాణ డిమాండ్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

    తద్వారా,భారత విమానయాన రంగం మరింత వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ఈ రంగం ఒకటిగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విమానం

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    విమానం

    Electric plane: ఈ విమానం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 800 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణించగలదు టెక్నాలజీ
    Boeing: బోయింగ్ నూతన సీఈఓగా "కెల్లీ" ఓర్ట్‌బర్గ్ బోయింగ్
    Boing : 'డోర్లు లోదుస్తుల వలె మారాయి'.. బోయింగ్ ఉద్యోగులు కార్యాలయ సవాళ్లను వెల్లడించారు బోయింగ్
    Spicejet: స్పైస్‌జెట్‌పై DGCA నిఘా.. సెలవుపై 150 మంది ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025