NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / India: సుదీర్ఘ లక్ష్యానికి చేరువలో భారత్.. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుదల! 
    తదుపరి వార్తా కథనం
    India: సుదీర్ఘ లక్ష్యానికి చేరువలో భారత్.. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుదల! 
    సుదీర్ఘ లక్ష్యానికి చేరువలో భారత్.. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుదల!

    India: సుదీర్ఘ లక్ష్యానికి చేరువలో భారత్.. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుదల! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 21, 2024
    06:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం మూడోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ముందంజలో ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 2030-31 నాటికి ఈ లక్ష్యాన్ని భారత్ ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆ నివేదిక అంచనా వేసింది.

    2024 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 8.2 శాతం ఉంటుందని పేర్కొంది. దేశ ఆర్థిక పురోగతికి కొనసాగుతున్న సంస్కరణలు కీలకమని నొక్కి చెప్పింది.

    సంస్కరణల ప్రాముఖ్యతను వివరించేటప్పుడు, ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడం, లాజిస్టిక్ వ్యవస్థను మెరుగుపరచడం, ప్రభుత్వ మూలధన వినియోగాన్ని తగ్గించడం వంటివి ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంది.

    Details

    మౌలిక వసతులకు మరింత మద్దతు

    దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి, పోటీతత్వాన్ని పెంచడానికి నిర్మాణాత్మక మార్పులు అవసరమని సంస్థ అభిప్రాయపడింది.

    ఈ నేపథ్యంలో, భారత ఈక్విటీ మార్కెట్లు కూడా బలమైన వృద్ధి దిశగా పయనిస్తున్నాయని తెలిపింది.

    భారత వాణిజ్యానికి 90 శాతం పైగా సముద్ర మార్గాలు కీలకం కావడంతో తీరప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా వాణిజ్య అవకాశాలు మరింతగా పెరుగుతాయని S&P గ్లోబల్ పేర్కొంది.

    సముద్ర మార్గాల్లో ఉన్న మౌలిక వసతుల అభివృద్ధి ఎగుమతులు, దిగుమతులకు మరింత మద్దతు ఇస్తుందని వివరించింది.

    Details

    ఉత్పాదకను పెంచడంలో పురోగతి

    ఇంధన అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో, పునరుత్పాదక ఇంధనాలవైపు భారత్‌ ముందడుగు వేస్తోందని నివేదిక వెల్లడించింది.

    కాలుష్య రహిత ఇంధన వాడకం, పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా ఇంధన భద్రతను సమతుల్యం చేయడం దేశానికి కీలకమని చెప్పింది.

    వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతలను అందుబాటులోకి తేవడం ద్వారా ఉత్పాదకతను పెంచడంలో పురోగతి సాధించింది.

    అయితే ఆహార భద్రత, నీటి పారుదల, ఆహార నిల్వలు, పంపిణీ వంటి కీలక సవాళ్లు దేశం ఎదుర్కొంటుందని నివేదిక హెచ్చరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    ఆర్థిక మాంద్యం

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    భారతదేశం

    Three indians arrested-Nijjar Assiniation: నిజ్జార్​ హత్య కేసులో ముగ్గురు భారతీయుల్ని అరెస్టు చేసిన కెనడా పోలీసులు కెనడా
    Canada: భారతదేశాన్ని రెండవ అతిపెద్ద విదేశీ ముప్పుగా పేర్కొన్న కెనడా  కెనడా
    NEET: 2024లో అవకతవకలపై CBI విచారణకు IMA డిమాండ్ భారతదేశం
    Lt General Upendra Dwivedi: కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియామకం భారతదేశం

    ఆర్థిక మాంద్యం

    అమెరికాలో త్వరలోనే ఆర్థిక మాంద్యం.. భారత్ సహా ప్రపంచంపైనా ప్రభావం అమెరికా
    కుదేలైన చైనా దిగ్గజ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ.. 57 వేల కోట్ల భారీ నష్టం చైనా
    Netherlands Recession: నెదర్లాండ్స్‌లో ఆర్థిక మాంద్యం; ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం  నెదర్లాండ్స్
    CHINA DELFATION : మళ్లీ ప్రతి ద్రవ్యోల్బణంలోకి జారిపోయిన డ్రాగన్ చైనా  చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025