Loading...
India's Manufacturing Sector: ఆగస్టులో భారత్ తయారీ రంగానికి ఎదురుదెబ్బ.. ఐదేళ్ల కనిష్ఠానికి పీఎంఐ
ఆగస్టులో భారత్ తయారీ రంగానికి ఎదురుదెబ్బ.. ఐదేళ్ల కనిష్ఠానికి పీఎంఐ

India's Manufacturing Sector: ఆగస్టులో భారత్ తయారీ రంగానికి ఎదురుదెబ్బ.. ఐదేళ్ల కనిష్ఠానికి పీఎంఐ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 01, 2026
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) ప్రకారం.. భారత్ తయారీ రంగం వృద్ధి ఆగస్టులో ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. జులైలో 53.5గా ఉన్న తయారీ పీఎంఐ ఆగస్టులో 52.8కి తగ్గింది. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తికి డిమాండ్ తగ్గడంతో తయారీ రంగం వృద్ధి మందగించింది. దీని ప్రభావం ఉద్యోగాలపైనా పడింది. రెండేళ్లకు పైగా తర్వాత తొలిసారిగా తయారీ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గింది.

వివరాలు 

తయారీ పీఎంఐ.. ఆర్థిక వృద్ధి

తయారీ రంగంలో కార్యకలాపాల పరిస్థితిని అంచనా వేయడానికి హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐ కీలక సూచికగా ఉంటుంది.

ఈ సూచీ 50కి పైన ఉంటే వృద్ధిని, 50కి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది.

ఆగస్టులో పీఎంఐ తగ్గినప్పటికీ.. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి సాధించింది.

ఇది 7.1 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసిన నిపుణుల అంచనాలను మించింది.

పెట్టుబడులు పెరగడం, తయారీ రంగం వృద్ధి ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.

అయితే ప్రస్తుత త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 6.6 శాతానికి తగ్గొచ్చని రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో నిపుణులు అంచనా వేశారు.

వివరాలు 

కొత్త ఆర్డర్లు.. ఉత్పత్తిలో మందగమనం

ఆగస్టులో కొత్త ఆర్డర్లు పెరిగినప్పటికీ.. 2021 ఆగస్టు తర్వాత ఇదే అత్యంత నెమ్మదైన వృద్ధి. మార్కెట్ పరిస్థితులు సవాలుగా మారడం, కొన్ని రకాల వస్తువులకు డిమాండ్ తగ్గడం ఇందుకు కారణమని నివేదిక తెలిపింది.

ఎగుమతి ఆర్డర్లు కూడా పెరిగాయి.

అయితే జులైతో పోలిస్తే వృద్ధి వేగం తగ్గింది. ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగినప్పటికీ.. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంత నెమ్మదిగా వృద్ధి నమోదైంది.

ADVERTISEMENT

వివరాలు 

ఉత్పత్తి వ్యయ ఒత్తిళ్లు తగ్గుముఖం

తయారీ సంస్థలు ఉద్యోగుల సంఖ్యను స్వల్పంగా తగ్గించాయి.

30 నెలల తర్వాత తొలిసారిగా ఫ్యాక్టరీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గడం గమనార్హం.

అయితే ఉత్పత్తి వ్యయాల విషయంలో మాత్రం కొంత ఉపశమనం లభించింది.

ముడిసరుకు ధరల పెరుగుదల ఆరు నెలల కనిష్ఠానికి చేరింది.

దీంతో సంస్థలు తమ ఉత్పత్తుల విక్రయ ధరలను పరిమితంగా మాత్రమే పెంచాయి.

ఫలితంగా ఉత్పత్తుల ధరల ద్రవ్యోల్బణం 45 నెలల కనిష్ఠ స్థాయికి తగ్గింది. దీర్ఘకాలిక సగటు స్థాయి కంటే కూడా తక్కువగా నమోదైంది.

ADVERTISEMENT