NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Maruthi: భారీ ప్రణాళికతో ముందుకొచ్చిన మారుతీ.. ఏకంగా 45వేల కోట్ల పెట్టుబడులు!
    తదుపరి వార్తా కథనం
    Maruthi: భారీ ప్రణాళికతో ముందుకొచ్చిన మారుతీ.. ఏకంగా 45వేల కోట్ల పెట్టుబడులు!
    భారీ ప్రణాళికతో ముందుకొచ్చిన మారుతీ.. ఏకంగా 45వేల కోట్ల పెట్టుబడులు!

    Maruthi: భారీ ప్రణాళికతో ముందుకొచ్చిన మారుతీ.. ఏకంగా 45వేల కోట్ల పెట్టుబడులు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 29, 2023
    06:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వార్షిక సాధారణ సమావేశంలో మారుతీ సుజుకీ కీలక నిర్ణయాలను తీసుకుంది. వచ్చే ఎనిమిదేళ్లలో తమ వార్షిక తయారీ సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచుతున్నట్లు ఇండియా ఛైర్మన్ ఆర్.సి.భార్గవ తెలిపారు.

    ఇందుకోసం రూ.45,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం జరిగిన వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు.

    రాబోయే రోజుల్లో వివిధ రకాల ఇంధన ఆధారిత వాహనాలను తీసుకొస్తామని, విద్యుత్, హైబ్రిడ్, సీఎన్‌జీ, ఇథనాల్ సహా కంప్రెస్డ్ బయోగ్యాస్ తో నడిచే వాహనాలను తీసుకురావడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రకటించారు.

    ఈ సమావేశంలో స్టాక్‌ విభజనపై వాటాదారుల సలహాలను స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

    Details

    వివిధ రకాల ఇంధనాలతో నడిచే వాహనాల తయారీకి ప్రయత్నం

    వచ్చే 8-10 సంవత్సరాల్లో సాంకేతికంగా రాబోతున్న మార్పులను అంచనా వేయడం కష్టమని, ఈ తరుణంలో వివిధ రకాల ఇంధనాలతో నడిచే వాహనాల తయారీకి ప్రయత్నించనున్నట్లు భార్గవ చెప్పారు.

    ఈ క్రమంలో 28 రకాల కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు తెలిపారు.

    ముఖ్యంగా 40ఏళ్లలో కంపెనీ రెండు మిలియన్ల యూనిట్ల విక్రయాలను చేరుకుందని, వచ్చే ఎనిమిదేళ్లలో మరో రెండు మిలియన్ల లక్ష్యాన్ని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

    కంపెనీ షేర్ విలువ దాదాపు రూ.10వేలకు చేరిందని, ఈ నేపథ్యంలో స్టాక్ విభజన అంశాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్తామని, ఇంకా ఆరు విద్యుత్ మోడళ్లను తీసుకొచ్చే యోచనలో ఉన్నామని వెల్లడించారు.

    ఇక కంపెనీ స్టాక్ మంగళవారం 0.39 శాతం పుంజుకొని రూ.9,634 దగ్గర స్థిరపడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    వ్యాపారం

    అవుట్‌పుట్ తగ్గింపుతో పెరిగిన చమురు ధరలు ప్రకటన
    ముడిచమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకి తగ్గించిన కేంద్రం ప్రభుత్వం
    2024 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 6.3%కి తగ్గించిన ప్రపంచ బ్యాంక్ బ్యాంక్
    హైదరాబాద్ లో 19% పెరిగిన ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025