LOADING...
Billionaires : బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల.. 2031 నాటికి 4 వేలు దాటే అవకాశం
బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల.. 2031 నాటికి 4 వేలు దాటే అవకాశం

Billionaires : బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల.. 2031 నాటికి 4 వేలు దాటే అవకాశం

వ్రాసిన వారు Moogati Shabari
Apr 23, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో భారీగా పెరిగే అవకాశముందని తాజా అంచనాలు చెబుతున్నాయి. 2031 నాటికి ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య దాదాపు 4,000కు చేరే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో 3,110 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇదే సంఖ్య వచ్చే ఐదేళ్లలో 25 శాతం పెరిగి 3,915కి చేరుతుందని అంచనా వేస్తోంది. అదే సమయంలో మల్టీమిలియనీర్ వర్గం కూడా వేగంగా పెరుగుతోంది. కనీసం 30 మిలియన్ డాలర్ల (సుమారు రూ.180 కోట్లు పైగా) సంపద కలిగిన వారి సంఖ్య 2021లో 1,62,191గా ఉంది. ప్రస్తుతం అది 7,13,626కి చేరింది. అంటే 300 శాతానికి పైగా పెరుగుదల నమోదైనట్టు నైట్ ఫ్రాంక్ పేర్కొంది.

వివరాలు

వారి సంపద భారీగా పెరుగుదల..

నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ హెడ్ లియామ్ బేలీ మాట్లాడుతూ, టెక్నాలజీ రంగం, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా బిలియనీర్లు, మిలియనీర్ల సంపద భారీగా పెరిగిందన్నారు. వ్యాపారాలను వేగంగా విస్తరించుకునే అవకాశాలు ఇప్పుడు మరింత పెరిగాయని, దీంతో తక్కువ సమయంలోనే భారీ సంపద సంపాదించే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. దేశాల వారీగా చూస్తే, చమురు సంపద ఉన్న సౌదీ అరేబియాలో బిలియనీర్ల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతుందని అంచనా. 2026లో 23 మంది ఉన్న బిలియనీర్లు, 2031 నాటికి 65కి పెరిగే అవకాశం ఉంది. పోలాండ్‌లో ఈ సంఖ్య 13 నుంచి 29కి పెరగనుండగా, స్వీడన్‌లో 32 నుంచి 58కి పెరిగే అవకాశం ఉందని నివేదిక చెబుతోంది.

వివరాలు

పన్నులు పెంచాలని ప్రపంచ నాయకులపై ఒత్తిడి

ఇదిలా ఉండగా ప్రపంచంలో ధనికులు-పేదల మధ్య అంతరం మరింత పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది విడుదలైన వరల్డ్ ఇనిక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం, ప్రపంచ జనాభాలో కేవలం 0.001 శాతం మాత్రమే ఉన్న 60 వేల మందికి కూడా తగ్గిన ఈ సూపర్ రిచ్ వర్గం, ప్రపంచంలోని దిగువ సగం ప్రజల మొత్తం సంపద కంటే మూడింతలు అధికంగా సంపదను నియంత్రిస్తోంది. ఈ నేపథ్యంలో సూపర్ రిచ్‌పై పన్నులు పెంచాలని ప్రపంచ నాయకులపై ఒత్తిడి పెరుగుతోంది. ఓక్స్ఫామ్ సంస్థ నివేదిక ప్రకారం, గత ఏడాది రికార్డు స్థాయిలో కొత్త బిలియనీర్లు ఏర్పడి మొత్తం సంఖ్య 3,000 దాటింది. వీరి మొత్తం సంపద 18.3 ట్రిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొంది.

Advertisement

వివరాలు

అత్యంత ధనవంతుడిగా మస్క్..

ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నిలిచారు. ఆయన సంపద 785.5 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ జాబితా పేర్కొంది. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ 272.5 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 259 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. బ్రిటన్‌లో అత్యంత ధనిక కుటుంబంగా హిందుజా కుటుంబం నిలిచింది. వారి సంపద సుమారు 35 బిలియన్‌గా సండే టైమ్స్ రిచ్ లిస్ట్ పేర్కొంది. ఆయిల్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారాలు నిర్వహించిన గోపీచంద్ హిందుజా గత ఏడాది 85 ఏళ్ల వయసులో మరణించారు.

Advertisement