NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Sebi: సెబీ చీఫ్‌ మాధబి పురీ బుచ్‌ పై ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిబ్బంది ఫిర్యాదు 
    తదుపరి వార్తా కథనం
    Sebi: సెబీ చీఫ్‌ మాధబి పురీ బుచ్‌ పై ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిబ్బంది ఫిర్యాదు 
    సెబీ చీఫ్‌ మాధబి పురీ బుచ్‌ పై ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిబ్బంది ఫిర్యాదు

    Sebi: సెబీ చీఫ్‌ మాధబి పురీ బుచ్‌ పై ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిబ్బంది ఫిర్యాదు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 04, 2024
    01:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అదానీ షేర్ల వ్యవహారంతో, ఐసీఐసీఐ బ్యాంక్ జీతభత్యాల విషయంలో వార్తల్లో నిలిచిన ఆమె, తాజాగా సెబీ అధికారులు చేసిన ఫిర్యాదులతో మరోసారి వివాదాల్లో నిలిచారు.

    సెబీ అధికారుల సమాచారం ప్రకారం, బుచ్ ఆధ్వర్యంలోని క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ కార్యాలయంలో పని సంస్కృతిపై అసంతృప్తి వ్యక్తమైంది. ఆంగ్ల మీడియా సంస్థ 'ఎకనమిక్ టైమ్స్'కి అనుగుణంగా, సెబీ అధికారులు ఆర్థిక మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసారు.

    సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానించడం వంటివి ఇప్పుడు ఒక రితిగా మారిపోయాయని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

    వివరాలు 

    ఉద్యోగులు మరమనుషులు కాదు 

    గ్రూప్ సభ్యులపై అసభ్య పదజాలం ఉపయోగిస్తారని, ప్రతీ నిమిషం వారి కదలికలను పర్యవేక్షిస్తారని, అవాస్తవ లక్ష్యాలను విధిస్తారని కూడా ఆరోపించారు.

    ఇది ఉద్యోగుల మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతోందని,వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను కాపాడలేకపోతున్నామని వారు వాపోయారు.

    మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేసినా స్పందన రాకపోవడం వల్ల ఆర్థిక మంత్రిత్వశాఖకు లేఖ రాసినట్లు వివరించారు.

    ఉద్యోగులు మరమనుషులు కాదని,కాదు కీ ఇవ్వగానే ఎక్కువ పని చేయడానికి అని లేఖలో రాసుకొచ్చారు

    గత 2-3ఏళ్లలో సెబీపై ఉద్యోగులకు నమ్మకం తగ్గి, భయం పెరుగుతోందని పేర్కొన్నారు.

    సెబీ చరిత్రలో ఉద్యోగుల స్నేహపూర్వక విధానాలపై అధికారుల ఆందోళన ఇది మొదటిసారి కావచ్చు.

    సెబీ ఈ విషయంపై స్పందిస్తూ,పని సంస్కృతిలో భాగంగా సమీక్షా సమావేశాల నిర్వహణలో మార్పులు తీసుకొచ్చామని తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెబీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025