LOADING...
Stock market: మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌.. లాభాల బాట పట్టిన దేశీయ మార్కెట్ సూచీలు
మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌.. లాభాల బాట పట్టిన దేశీయ మార్కెట్ సూచీలు

Stock market: మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌.. లాభాల బాట పట్టిన దేశీయ మార్కెట్ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టిన కారణంగా మార్కెట్‌లో పాజిటివ్ సెంటిమెంట్ తలెత్తింది. ట్రంప్, అమెరికా-చైనా మధ్య టారిఫ్ సమస్యపై వెనక్కి తగ్గతానని, అలాగే భారత్‌తో త్వరలో ఒక మంచి ట్రేడ్ డీల్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని డావోస్ వేదికపై ప్రకటించటంతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం పుట్టింది. దీని ప్రభావంగా, మూడు రోజుల నష్టాల సీరీస్‌కు బ్రేక్ పడింది,సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,909.63 వద్ద ముగింపు తర్వాత 82,459.66 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై, ఇంట్రాడేలో 82,783.18 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 397.74 పాయింట్ల లాభంతో 82,307.37 వద్ద ముగిశింది. నిఫ్టీ కూడా 132.40 పాయింట్ల లాభంతో 25,289.90 వద్ద స్థిరపడింది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ధర 64.55 డాలర్లు 

డాలరుతో రూపాయి మారకం విలువ, గత అతి తక్కువ స్థాయిల నుండి కొంత కోలుకొని 91.62 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో బీఈఎల్‌, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభపడిన ప్రధాన కంపెనీలుగా ఉన్నాయి. మరోవైపు, ఎటర్నెల్‌, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 64.55 డాలర్ల వద్ద స్థిరంగా ఉండగా, బంగారం ఔన్సు ధర 4824 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement