NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market : ఆర్‌బీఐ సమీక్ష నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత.. స్వల్ప నష్టాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 
    తదుపరి వార్తా కథనం
    Stock Market : ఆర్‌బీఐ సమీక్ష నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత.. స్వల్ప నష్టాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 
    ఆర్‌బీఐ సమీక్ష నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత..

    Stock Market : ఆర్‌బీఐ సమీక్ష నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత.. స్వల్ప నష్టాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 07, 2025
    09:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాలతో పాటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సమీక్ష నిర్ణయాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.

    పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ ఈ రోజు ప్రకటించనున్న కారణంగా మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    దీని ప్రభావంతో మార్కెట్ సూచీలు ఒత్తిడికి లోనవుతున్నాయి.

    ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్‌ (Sensex) 57.44 పాయింట్లు కోల్పోయి 78,000.72 వద్ద, నిఫ్టీ (Nifty) 24.45 పాయింట్లు నష్టపోయి 23,578.90 వద్ద ట్రేడింగ్‌ అవుతున్నాయి.

    వివరాలు 

    మిశ్రమంగా కడుకుతున్న ఆసియా-పసిఫిక్ మార్కెట్లు 

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.57గా ఉంది. నిఫ్టీలో భారతీ ఎయిర్‌టెల్‌, బ్రిటానియా, హీరో మోటార్స్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, అపోలో హాస్పిటల్స్‌ షేర్లు మంచి ప్రదర్శన చూపుతున్నాయి.

    ఓఎన్జీసీ, ఎస్‌బీఐ, హిందుస్థాన్‌ యునీలివర్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

    ఆసియా-పసిఫిక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా కదలాడుతున్నాయి.

    ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ స్థిరంగా ఉండగా, జపాన్‌ నిక్కీ 0.44 శాతం, దక్షిణ కొరియా కోస్పీ సూచీ 0.17 శాతం నష్టాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి.

    హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీ మాత్రం 0.6 శాతం లాభంతో కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం బలంగా వ్యాపారం చేశాయి, ఎస్‌అండ్‌పీ సూచీ 0.36 శాతం, నాస్‌డాక్‌ 0.51 శాతం, డోజోన్స్‌ 0.28 శాతం మేర లాభపడ్డాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    స్టాక్ మార్కెట్

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @23,200 బిజినెస్
    Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 23,200ఎగువన నిఫ్టీ బిజినెస్
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు బిజినెస్
    Stock Market: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 318 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025