Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన నిఫ్టీ.. ఒడిదుడుకుల్లో సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగి.. చివరకు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. దీంతో బెంచ్మార్క్ సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలోనే కదలాడాయి. ముగింపు సమయానికి నిఫ్టీ 53.00 పాయింట్లు (0.23 శాతం) లాభపడి 23,270.60 వద్ద స్థిరపడింది. మరోవైపు సెన్సెక్స్ 21.86 పాయింట్లు (0.029 శాతం) నష్టపోయి 74,314.59 వద్ద ముగిసింది.
వివరాలు
రోజులో గరిష్ఠాలు.. కనిష్ఠాలు
గురువారం ఉదయం 10:55 గంటల సమయంలో నిఫ్టీ 23,363.55 వద్ద గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది.
ఇదే సమయంలో సెన్సెక్స్ 74,677.56 వద్ద నాటి గరిష్ఠానికి చేరింది.
అయితే, మార్కెట్లలో లాభాల స్వీకరణ మొదలవడంతో ఒంటిగంట సమయంలో సూచీలు క్రమంగా లాభాలను కోల్పోయాయి.
ఈ క్రమంలో సెన్సెక్స్ 74,163.95 వద్ద కనిష్ఠ స్థాయిని తాకగా.. నిఫ్టీ 23,193.65 వద్ద నాటి కనిష్ఠానికి పడిపోయింది.
వివరాలు
హెవీవెయిట్ షేర్ల అండతో నిఫ్టీ లాభాల్లోకి..
మార్కెట్ ముగిసే సమయానికి హెచ్డీఎఫ్సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది.
దీంతో నిఫ్టీ తిరిగి లాభాల్లోకి వచ్చి ముగిసింది. అయితే, సెన్సెక్స్ మాత్రం స్వల్ప నష్టాలతోనే సెషన్ను ముగించింది.
రంగాల వారీగా ట్రేడింగ్
రంగాల వారీగా పరిశీలిస్తే.. హెల్త్కేర్, ఆటోమొబైల్, లైఫ్ ఇన్సూరెన్స్, ఫార్మా రంగాలు సానుకూలంగా రాణించాయి. మరోవైపు ఓఎన్జీసీ, టైటాన్తో పాటు ఐటీ రంగానికి చెందిన హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ వంటి షేర్లలో విక్రయాల ఒత్తిడి కనిపించింది.