Loading...
Telangana Rains: తెలంగాణలో వాతావరణ మార్పు.. 48 గంటల్లో భారీ వర్ష సూచన .. 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్  
23 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telangana Rains: తెలంగాణలో వాతావరణ మార్పు.. 48 గంటల్లో భారీ వర్ష సూచన .. 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని రోజులుగా సాధారణ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ, రానున్న 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వివరాలు 

23 జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్ వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వివరాలు 

అధికారుల ముందస్తు చర్యలు

వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ల సమీపంలో నిలబడవద్దని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

వర్షపు నీరు నిలిచిపోయే అవకాశాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీతో పాటు జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది.

రైతులు, స్థానిక ప్రజలు వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT