Page Loader
Allu Arjun: అల్లు అర్జున్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు
అల్లు అర్జున్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు

Allu Arjun: అల్లు అర్జున్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 03, 2025
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో "పుష్ప 2" సినిమా బెనిఫిట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ ఘటన నేపథ్యంలో,ఈ నెల 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి, విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తరువాత అతన్ని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచగా,న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. తరువాత,అల్లు అర్జున్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు.ఇదిలా ఉండగా,అల్లు అర్జున్ తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై, హైకోర్టు అతనికి 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

వివరాలు 

బెయిల్ ఇవ్వకుండా, కేసు పెట్టాలన్న పబ్లిక్ ప్రాసిక్యూషన్

సంధ్య థియేటర్ ఘటనపై నమోదైన కేసులో అల్లు అర్జున్ బెయిల్ పై అనేక ప్రశ్నలు వచ్చాయి. అతని బెయిల్ పిటిషన్‌పై పోలీసులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆ తరువాత, న్యాయవాదులు అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్, బెయిల్ ఇవ్వకుండా, కేసు పెట్టాలని కోరింది. రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత, న్యాయస్థానం ఉత్కంఠను తొలగిస్తూ నాంపల్లి కోర్టు అతనికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో, అల్లు అర్జున్ అభిమానులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.