NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Ram Charan: టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మకు ఫ్యాన్స్ ఫిదా.. తొలిసారి పెట్‌తో పాటు విగ్రహం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ram Charan: టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మకు ఫ్యాన్స్ ఫిదా.. తొలిసారి పెట్‌తో పాటు విగ్రహం
    టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మకు ఫ్యాన్స్ ఫిదా.. తొలిసారి పెట్‌తో పాటు విగ్రహం

    Ram Charan: టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మకు ఫ్యాన్స్ ఫిదా.. తొలిసారి పెట్‌తో పాటు విగ్రహం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 11, 2025
    09:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌ చరణ్ ఖాతాలో మరో గౌరవనీయమైన కీర్తి కిరీటం చేరింది.

    పాన్‌ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' ద్వారా గ్లోబల్‌ గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్‌ తన క్రేజ్‌ను మరోసారి చాటి చెప్పాడు.. తాజాగా లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

    మైనపు విగ్రహం స్థాపించిన మూడో టాలీవుడ్ నటుడిగా చరణ్‌ నిలిచారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన హాజరై కుటుంబంగా ఈ ప్రత్యేక సందర్భాన్ని సంబరంగా మార్చారు.

    భారత కాలమానం ప్రకారం మే 10 శనివారం సాయంత్రం చరణ్‌ స్వయంగా తన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు.

    Details

    ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

    ఈ సందర్భానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    తన మైనపు విగ్రహం పక్కన పోజులిచ్చిన రామ్‌చరణ్‌... ప్రత్యేక ఆకర్షణగా తన పెంపుడు కుక్క 'రైమ్‌'తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.

    మేడమ్ టుస్సాడ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి ఒక సెలబ్రిటీ మైనపు విగ్రహానికి అతడి పెంపుడు జంతువుతో కూడిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం.

    మ్యూజియం నిర్వాహకులు రామ్‌చరణ్‌కి విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలియజేసినప్పుడు, చరణ్‌ తన బొమ్మతో పాటు రైమ్ బొమ్మను కూడా పెట్టాలని ప్రత్యేకంగా సూచించడంతో, టుస్సాడ్స్ వారు ఆ అభ్యర్థనను అంగీకరించి విగ్రహాల కొలతలు తీసుకున్నారు.

    Details

    మే19న ప్రదర్శనకు ఉంచే అవకాశం

    ఆవిష్కరణ సందర్భంగా రైమ్ తన మైనపు రూపాన్ని చూసి కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత సోఫా ఎక్కి చరణ్ పక్కన కూర్చొని ఫోటోలకు స్టైల్‌గా పోజులిచ్చింది.

    ఇప్పుడు ఈ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలించి, మే 19 నుంచి అక్కడ ప్రదర్శనకు ఉంచనున్నారు.

    ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్‌ల మైనపు విగ్రహాలను టుస్సాడ్స్‌ మ్యూజియాల్లో ఏర్పాటు చేయగా.. ఇప్పుడు ఆ ప్రత్యేక జాబితాలో రామ్‌చరణ్‌ కూడా చేరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ చరణ్
    టాలీవుడ్

    తాజా

    Ram Charan: టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మకు ఫ్యాన్స్ ఫిదా.. తొలిసారి పెట్‌తో పాటు విగ్రహం రామ్ చరణ్
    Team India: రోహిత్‌ అవుట్‌... గిల్‌ ఇన్‌.. టెస్ట్‌ జట్టుకు కొత్త బాస్ రెడీ! శుభమన్ గిల్
    Vikram Misri: కాల్పుల విరమణను పాక్ తుంగలో తొక్కింది.. విక్రమ్ మిస్రీ ఆగ్రహం భారతదేశం
    India Pak Conflict: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత? ఒమర్ అబ్దుల్లా

    రామ్ చరణ్

    Divyenndu Sharma: రామ్‌చరణ్ RC16 సినిమాలో 'మీర్జాపూర్' నటుడు.? సినిమా
    RC16: మైసూరులో రామ్ చరణ్ తొలి షెడ్యూల్ ప్రారంభం సినిమా
    Ram Charan: "ఆర్‌సీ 16" లుక్.. చిట్టిబాబును మించేలా రామ్ చరణ్‌ లుక్! జాన్వీ కపూర్
    Sai Pallavi: సాయి పల్లవికి క్రేజీ ఆఫర్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో రోమాన్స్..? టాలీవుడ్

    టాలీవుడ్

    Pravasthi Elimination: ఇక్కడ న్యాయం ఉండదా?..'పాడుతా తీయగా'పై సింగర్ ప్రవస్తి షాకింగ్ కామెంట్స్..! సినిమా
    SS Rajamouli: స్టార్ హీరోలకంటే రాజమౌళికే రెమ్యునరేషన్ ఎక్కువ.. నివేదికిచ్చిన IMDB రాజమౌళి
    Robinhood : 'రాబిన్‌హుడ్' ఓటీటీలోకి వచ్చేస్తోంది.. మిస్ అవ్వకండి! నితిన్
    MAD Square: ఓటీటీలోకి 'మ్యాడ్‌ స్క్వేర్‌'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే! ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025