Kumari Aunty: సోషల్ మీడియాకు ధన్యవాదాలు : కుమారి ఆంటీ
ఇటీవల కాలంలో.. "మీది వెయ్యి అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా" అనే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యారు కుమారీ ఆంటీ. సోషల్ మీడియాతో కుమారి ఆంటీ సెలబ్రిటీ అయిన విషయం తెలిసిందే. అనుకోని విధంగా.. స్ట్రీట్ ఫుడ్ అమ్మే స్థాయి నుంచి ఇప్పుడు స్టేజ్ మీద పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చే స్థాయికి ఎదిగారు ఆమె. తెలుగు డిజిటిల్ మీడియా ఫెడరేషన్ ఆరిజిన్ డే సందర్భంగా ఆమె స్టేజ్ మీద ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచం అంటే తెలియని నాకు ఇంత పేరు వస్తుందని ఊహించలేదు. దీనికి కారణం సోషల్ మీడియానే. ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాగైనా ముందుకు వెళ్ళచ్చు అని చెప్పింది.