Loading...
NTR: ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తల్లో నిజం లేదు.. స్పష్టత ఇచ్చిన అభిమానుల సంఘం
స్పష్టత ఇచ్చిన అభిమానుల సంఘం

NTR: ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తల్లో నిజం లేదు.. స్పష్టత ఇచ్చిన అభిమానుల సంఘం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియా, కొన్ని వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా జులై 18న ఆయన రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన ఉంటుందంటూ వార్తలు వైరల్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రచారానికి ఎన్టీఆర్ అభిమానుల సంఘం తాజాగా పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చింది. అభిమానుల సంఘం విడుదల చేసిన లేఖలో జులై 18న నిర్వహించనున్న 'ఊరు-వాడ' కార్యక్రమానికి ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఇది పూర్తిగా ఒక సామాజిక సేవా కార్యక్రమమని, దీనిని రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి చేసింది.

వివరాలు 

జూనియర్ ఎన్టీఆర్ స్పందన కోసం అభిమానులు ఆసక్తి

అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికలు చాలా కాలం క్రితమే సిద్ధం చేశామని అభిమానుల సంఘం వెల్లడించింది.

దీనిని రాజకీయాలతో ముడిపెట్టి జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది.

తప్పుడు వార్తలను ప్రసారం చేయకుండా మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది.

ఇలాంటి నిరాధార ప్రచారం వల్ల అభిమానులు అనవసరంగా అయోమయానికి గురవుతున్నారని, వాస్తవాలను మాత్రమే విశ్వసించాలని అభిమానుల సంఘం తన లేఖలో స్పష్టం చేసింది.

అయితే ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా స్పందిస్తారా లేదా అన్న విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వివరాలు 

రాజకీయ చర్చల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు

ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ పార్టీతో ముందుకు వచ్చిన నేపథ్యంలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన మరికొందరు ప్రముఖ హీరోలు కూడా రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు తరచూ వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా రాజకీయ చర్చల్లో వినిపిస్తోంది.

అదే సమయంలో నటుడు అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను ఆయన కలిశారంటూ పలు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ADVERTISEMENT