Samajavaragamana: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'సమాజవరగమన'; ఆహాలో ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సమాజవరగమన'. ఈ మూవీ ఇప్పటి వరకు రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసి హీరో శ్రీవిష్ణు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమా త్వరలో ఓటిటిలోకి రాబోతోంది. సమాజవరగమన డిజిటల్ హక్కులను ఆహా కొనుగోలు చేసింది. త్వరలోనే సమాజవరగమన ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఆహా ట్వీట్ చేసింది. అయితే మూవీ ఓటీటీలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని ఆహా వెల్లడించలేదు. ఈ సినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ దండా సమాజవరగమన చిత్రాన్ని నిర్మించారు.