NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Diljit Dosanjh: హైదరాబాద్ కచేరీకి ముందు దిల్జిత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం నోటీసు
    తదుపరి వార్తా కథనం
    Diljit Dosanjh: హైదరాబాద్ కచేరీకి ముందు దిల్జిత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం నోటీసు
    హైదరాబాద్ కచేరీకి ముందు దిల్జిత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం నోటీసు

    Diljit Dosanjh: హైదరాబాద్ కచేరీకి ముందు దిల్జిత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం నోటీసు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 15, 2024
    11:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోశాంజ్ మళ్లీ వార్తల్లో నిలిచారు.ఆయన లైవ్ షోలతో పాటు వాటికీ సంబంధించి ఉండే వివాదాలు దృష్ట్యా, తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

    నవంబర్ 15న హైదరాబాద్‌లో దిల్జిత్ కాన్సర్ట్ నిర్వహించబడనుంది. ఈ క్రమంలో,ఈవెంట్ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

    ఆ నోటీసుల ప్రకారం, పిల్లలను వేదికపైకి తీసుకెళ్లకుండా ఉండమని సూచించారు.

    WHO మార్గదర్శకాలు ప్రకారం,లైవ్ షోల సమయంలో లౌడ్ మ్యూజిక్, ఫ్లాష్ లైట్లు ఉంటాయని, ఈ కారణంగా పిల్లలను వేదికపైకి ఎక్కించకూడదని ఆదేశించారు.

    అంతేకాదు, మద్యం, మాదకద్రవ్యాలు, హింసను ప్రోత్సహించే పాటలను వేదికపై పాడకూడదని హెచ్చరించారు.

    వివరాలు 

    లైవ్ షోలో 120 dB కంటే ఎక్కువ శబ్దం.. పిల్లలను వేదికపైకి తీసుకెళ్లకూడదు

    WHO మార్గదర్శకాల ప్రకారం, పెద్దలపై 140 dB కన్నా ఎక్కువ శబ్ద ఒత్తిడి పడకూడదని, పిల్లలు 120 dB కన్నా ఎక్కువ శబ్దం తట్టుకోలేకపోవచ్చని చెప్పారు.

    అందువల్ల, లైవ్ షోలో 120 dB కంటే ఎక్కువ శబ్దం ఉన్నందున, పిల్లలను వేదికపైకి తీసుకెళ్లకూడదని పేర్కొన్నారు.

    అలాగే, నోటీసులో, దిల్జిత్ గత కచేరీలలో మద్యం, మాదకద్రవ్యాలను ప్రోత్సహించే పాటలు పాడిన వీడియోలను ఆధారంగా చూపించి, అలాంటి పాటలను రిపీట్ చేయరాదని సూచించారు.

    ఈ వివాదం ఇంతకుముందు ఢిల్లీలోని జవహర్ లాల్ స్టేడియంలో జరిగిన దిల్-లుమ్నాటి సంగీత కచేరీలో కూడా వెలుగులోకి వచ్చింది.

    అక్కడ దిల్జిత్ పాడిన పాటలు "పాటియాలా పెగ్","పంజ్ తారలా"వంటి వాటి గురించి కూడా అనేక చర్చలు జరిగాయి.

    వివరాలు 

    ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో దిల్జిత్ కచేరీ

    గత కొన్ని నెలలుగా, దిల్జిత్ లైవ్ షోలపై తీవ్ర వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.

    ఆక్టోబర్ 26-27 తేదీల్లో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో దిల్జిత్ కచేరీ జరిగింది.

    ఈ కార్యక్రమం ముగియడంతో, స్టేడియంలో చెత్త వ్యాపించడమే కాకుండా, మద్యం, వాటర్ బాటిళ్లను అక్కడక్కడ విసిరేయడం జరిగింది.

    కుర్చీలు విరిగి, రన్నింగ్ ట్రాక్‌పై కుళ్ళిపోయిన ఆహారం పడి ఉండడం చూసి అందరూ అంగీకరించలేదు.

    ఈ చెత్త కారణంగా, ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను నిలిపి వేయాల్సి వచ్చిందని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ

    తెలంగాణ

    Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇకపై కాన్వాయ్‌ వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు ఉండవు! రేవంత్ రెడ్డి
    Telangana: సియోల్‌లో తెలంగాణ మంత్రుల పర్యటన.. నీటి వనరుల ప్రాజెక్టులపై దృష్టి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    Telangana: తెలంగాణలో ఎన్‌ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ.. ప్రభుత్వం అధికారిక ప్రకటన  ప్రభుత్వం
    Telangana Rains: తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి- మోస్తరు వర్షాలు.. ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు భారీ వర్షాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025