Page Loader
Vijaya Rangaraju: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ విలన్ కన్నుమూత
టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ విలన్ కన్నుమూత

Vijaya Rangaraju: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ విలన్ కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2025
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సినీ ప్రముఖుడు విజయ రంగరాజు (రాజ్ కుమార్) సోమవారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఆయన వారం క్రితం హైదరాబాద్‌లో షూటింగ్ సమయంలో గాయపడిన అనంతరం చెన్నైలో చికిత్స పొందుతూ మరణించారు. విజయ రంగరాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విజయ రంగరాజు 1980లలో 'సీతా కళ్యాణం' సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టారు. 1994లో విడుదలైన 'భైరవ ద్వీపం' చిత్రంతో ఆయన నటనా రంగంలో మంచి గుర్తింపు పొందారు. ఆపై విలన్ పాత్రల్లో విశేషంగా నటించి, 'యజ్ఞం' చిత్రంతో మరింత క్రేజ్ సంపాదించారు.

Details

టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

గోపీచంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయన విలన్ పాత్ర ప్రాముఖ్యత పొందింది. విజయ రంగరాజు తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాక, ఆయన వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లోనూ పట్టు కలిగి ఉన్నారు. విజయ రంగరాజు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.