NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఆదాయం అదుర్స్.. మొదటి మూడు త్రైమాసికాల్లో ఎంత వచ్చిందంటే?
    తదుపరి వార్తా కథనం
    ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఆదాయం అదుర్స్.. మొదటి మూడు త్రైమాసికాల్లో ఎంత వచ్చిందంటే?
    2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం అదుర్స్

    ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఆదాయం అదుర్స్.. మొదటి మూడు త్రైమాసికాల్లో ఎంత వచ్చిందంటే?

    వ్రాసిన వారు Stalin
    Dec 27, 2022
    02:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కార్గో సేవల్లో ఏపీఎస్ఆర్టీసీ దూసుకుపోతోంది. సురక్షితంగా, సకాలంలో, చౌకగా గమ్యస్థానాలకు సరుకులను చేరుస్తుండటంతో కార్గో సేవలకు ఆదరణ రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఆదాయం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. కార్గో సేవల ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో రూ.122 కోట్ల ఆదాయంతో సత్తా చాటింది ఏపీఎస్ఆర్టీసీ.

    ఆరేళ్ల క్రితం కార్గో వ్యాపారంలోకి ప్రవేశించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ).. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. గతం ఏడాది అనుకున్న లక్ష్యాన్ని సాధించామని, ఈ ఏడాది కూడా రూ.200 కోట్ల లక్ష్యాన్ని అధిగమిస్తామని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

    కార్గో

    ప్రతి గల్లీలోనూ ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలు

    ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గల్లీలోనూ ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలు అందుతున్నాయని ద్వారకా తిరుమలరావు తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాలకు కార్గో సేవలను విస్తరించినట్లు చెప్పారు.

    ఏపీలో 249 బస్ స్టేషన్లలో పార్శిల్ కౌంటర్లు ప్రారంభించామన్నారు. 525 బుకింగ్ ఏజెంట్లను నియమించినట్లు పేర్కొన్నారు.

    ఇప్పటి వరకు రూ.100కోట్ల వ్యాపారాన్ని చేస్తూ వచ్చిన ఏపీఎస్ఆర్టీసీ కార్గో.. 2022-23లో రూ. 200కోట్ల వ్యాపార ట్రేడ్ మార్క్‌ను చేరుకుంటుందని ద్వారకా తిరుమలరావు ఆశాభావం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆంధ్రప్రదేశ్

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? వై.ఎస్.జగన్
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్ చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025