పోలవరం: వార్తలు

పోలవరంపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రతిష్టాత్మమైన పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ పోలవరానికి నిధుల ప్రవాహం... అదనంగా రూ.12,911 కోట్లు శాంక్షన్

పోలవరం నేషనల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కు అదనంగా రూ.12,911.15 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

పోలవరం జలాశయంలో కుంగిన స్పిల్ వే గైడ్ బండ్... హుటాహుటిన సీడబ్ల్యూసీ సమీక్ష

గోదావరి నీటిని స్పిల్‌ వే‌లోకి మళ్లించేందుకు ఉపయోగించే గైడ్ బండ్ కు పగుళ్లు ఏర్పడి నెర్రలు బాసింది. గ్రావిటీ మీదుగా నీటి విడుదలకు సమాయత్తమవుతున్న క్రమంలో గైడ్ బండ్ కుంగిపోవడంపై అధికారుల్లో టెన్షన్ రేపుతోంది.

05 Jun 2023

తెలంగాణ

పోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం 

పోలవరం వెనుక జలాలతో తెలంగాణలో ముంపు సమస్య ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వే పూర్తయ్యే వరకు నీరు నిల్వ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు 

పోలవరం ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దిల్లీలో కీలక సమీక్ష నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లని పేర్కొంది. 1980 ట్రిబ్యూనల్ అవార్డు ప్రకారం పోలవరం ఎత్తు 45.72 మీటర్లని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానం చెప్పారు.

పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన

పోలవరం ప్రాజెక్టుపై గురువారం కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంలో నీటి నిల్వ ప్రస్తుతం 41.15 మీటర్లకే పరమితం చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్రం పేర్కొంది.