NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ₹ 2,348 కోట్లు.. అడ్వాన్సుగా విడుదల..కేంద్ర జల శక్తి శాఖ షరతులు
    తదుపరి వార్తా కథనం
    Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ₹ 2,348 కోట్లు.. అడ్వాన్సుగా విడుదల..కేంద్ర జల శక్తి శాఖ షరతులు
    పోలవరం ప్రాజెక్టుకు ₹ 2,348 కోట్లు.. అడ్వాన్సుగా విడుదల

    Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ₹ 2,348 కోట్లు.. అడ్వాన్సుగా విడుదల..కేంద్ర జల శక్తి శాఖ షరతులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 11, 2024
    08:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ తొలిసారి అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,348 కోట్లను విడుదల చేస్తూ గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

    ఈ నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతాలో సర్దుబాటు చేయాలని సీనియర్ జాయింట్ కమిషనర్ డీసీ భట్,ఢిల్లీలోని ప్రిన్సిపల్ ఎకౌంట్స్ అధికారికి లేఖ రాశారు.

    రెండు రోజుల క్రితం ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకోగా,దానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది.

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్‌లోని కంటింజెన్సీ ఫండ్ నుంచి ఈ అడ్వాన్స్ నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు.

    నాబార్డు రుణం ద్వారా కాకుండా,నేరుగా కేంద్ర బడ్జెట్ నుంచే ఈ నిధులు విడుదలవుతున్నాయి.

    వివరాలు 

    షరతులు

    మరో రెండు కేటగిరీల కింద కూడా గతంలో జరిగిన ప్రాజెక్టు పనులకు కేంద్ర జలశక్తి శాఖ నిధులను రీయింబర్స్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

    ఒక కేటగిరీలో రూ.383.227 కోట్లు, మరో కేటగిరీలో రూ.76.463 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

    దీంతో పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం రూ.2,807 కోట్లు విడుదలయ్యాయి.

    పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్ నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది:

    ఇప్పటివరకు విడుదల చేసిన రూ.2,348 కోట్లలో 75 శాతం నిధులు ఖర్చు చేసిన తరువాతే తదుపరి విడత నిధులు విడుదల చేస్తారు.

    వివరాలు 

    షరతులు

    తదుపరి విడత నిధులను విడుదల చేయాలంటే, నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పోలవరం నిర్మాణ పనులు జరగాలి. ఆలస్యమైతే, స్పష్టమైన కారణాలను గుర్తించి చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలశక్తి శాఖకు తెలియజేయాలి.

    పోలవరం పనులు సకాలంలో పూర్తయ్యేందుకు సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.

    కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రకారం,రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన ప్రాజెక్టు సవరించిన నిర్మాణ షెడ్యూల్‌ను ఒప్పందంలో పొందుపరచాలి.

    ప్రస్తుతం విడుదల చేస్తున్న కేంద్ర నిధులను ఒప్పందంలో పేర్కొన్న పనులకే వినియోగించాలి.

    వివరాలు 

    షరతులు 

    నిర్దేశిత పనులకు మాత్రమే నిధులు వినియోగించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ధ్రువీకరణ పత్రాలు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపాలి, తర్వాత వాటిని కేంద్ర జలశక్తి శాఖకు పంపాలి.

    ఈ నిధులకు సంబంధించిన ఖాతాలను కాగ్ అధికారులకు అందుబాటులో ఉంచాలి.

    ప్రతి త్రైమాసికంలో ప్రాజెక్టు ఆర్థిక పురోగతిపై కేంద్రానికి అథారిటీ నివేదికలు సమర్పించాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పోలవరం
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి
    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్

    పోలవరం

    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్
    పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజా వార్తలు
    2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు  గజేంద్ర సింగ్ షెకావత్
    పోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం  తెలంగాణ

    కేంద్ర ప్రభుత్వం

    India's Budget 2024: వ్యక్తిగత పన్ను రేటును తగ్గించాలని కేంద్రం భావిస్తోంది  బిజినెస్
    Medicines Prices:సామాన్యులకు షాకింగ్‌.. పెరగనున్న 54 రకాల మందుల ధరలు  బిజినెస్
     maternity leave for surrogacy: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సరోగసీ కోసం 6 నెలల ప్రసూతి సెలవులు  భారతదేశం
    DPDP విధానాలను రెడీ చేస్తున్న కేంద్రం.. ఆందోళనలో సోషల్ మీడియా కంపెనీలు  సోషల్ మీడియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025