NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Polavaram: పోలవరం ప్రాజెక్టు.. అంతర్జాతీయ నిపుణులతో డ్యామ్ డిజైన్ల రూపకల్పన
    తదుపరి వార్తా కథనం
    Polavaram: పోలవరం ప్రాజెక్టు.. అంతర్జాతీయ నిపుణులతో డ్యామ్ డిజైన్ల రూపకల్పన
    పోలవరం ప్రాజెక్టు.. అంతర్జాతీయ నిపుణులతో డ్యామ్ డిజైన్ల రూపకల్పన

    Polavaram: పోలవరం ప్రాజెక్టు.. అంతర్జాతీయ నిపుణులతో డ్యామ్ డిజైన్ల రూపకల్పన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 13, 2024
    10:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పోలవరం ప్రాజెక్టు కోసం డిజైన్ల రూపకల్పన, ఆమోదం ప్రక్రియలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

    గతంలో, పోలవరం డిజైన్లను ఆమోదించడానికి కేంద్ర జలసంఘం డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

    ఈ వ్యవస్థ 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో జరిగిన చర్చల ఫలితంగా వేగంగా డిజైన్ ఆమోదం పొందడంలో సాయపడింది.

    అయితే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి ఉన్నప్పుడు పోలవరం పనులు ఆగిపోవడంతో విదేశీ నిపుణుల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది.

    ఈ క్రమంలో ప్రాజెక్టు కోసం మేఘా సంస్థ సేవలను తీసుకోవడానికి నిర్ణయించారు. ఆ సంస్థ తరపున, ఆస్ట్రియాకు చెందిన ఆఫ్రి కన్సల్టెన్సీని నియమించారు.

    Details

    ఆన్ లైన్ సమావేశాలు ఏర్పాటు

    ప్రస్తుతం ఈ సంస్థ కొత్త డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం డిజైన్లను రూపకల్పన చేస్తోంది.

    ఇదే సమయంలో కేంద్ర జలసంఘం ప్రపంచవ్యాప్త టెండర్లు పిలిచి, పోలవరం ప్రాజెక్టుకు సవాళ్ల పరిష్కారాలను సమర్ధించే విదేశీ నిపుణుల బృందాన్ని నియమించింది.

    ఇప్పటికే, ఈ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును రెండుసార్లు సందర్శించి, కీలక సిఫారసులు ఇచ్చింది. వారి పరిశీలన, అధ్యయనాల ఆధారంగా, తాజా డిజైన్లను ఆమోదించే ప్రక్రియ ప్రారంభమైంది.

    ఈ నిపుణుల బృందం పరిశీలన తరువాత, డిజైన్లను పోలవరం అథారిటీకి అందించగా, వారు అవి ఆమోదించి, ఆ తర్వాత కేంద్ర జలసంఘం నిపుణులకు పంపిస్తారు.

    ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పురోగతిని వేగవంతం చేసేందుకు, ఆన్‌లైన్ సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

    Details

    అంతర్జాతీయ నిపుణులు

    1. డేవిడ్ బి.పాల్ (అమెరికా)

    డ్యాం భద్రత, మౌలిక వసతుల నిర్వహణలో 35 ఏళ్ల అనుభవం.

    2. రిచర్డ్ డోన్నెల్లీ (కెనడా)

    హైడ్రాలిక్ నిర్మాణాలు, నీటివనరుల నిర్వహణలో 30 ఏళ్ల అనుభవం.

    3. గియాస్ ఫ్రాంకో డి సిస్కో (అమెరికా)

    పెద్ద డ్యాంల నిర్మాణం, నిర్వహణలో 28 సంవత్సరాల అనుభవం.

    4. సీస్ హించ్‌బెర్గర్ (కెనడా)

    జియోటెక్నికల్ ఇంజినీరింగ్, నీటిపారుదల నిర్వహణలో 25 ఏళ్ల అనుభవం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పోలవరం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    పోలవరం

    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
    పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజా వార్తలు
    2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు  తాజా వార్తలు
    పోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం  తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    AP : రహస్య జీవోలను బయటపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రభుత్వం
    AP Dwakra Mahilalu : డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ శుభవార్త.. పరిశ్రమల ఏర్పాటు- భారీ రాయితీతో రుణాలు భారతదేశం
    AP Govt: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీలో 32 మంది డిప్యూటీ కలెక్టర్ బదిలీ ఇండియా
    High Court: ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం హైకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025