NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పోలవరంపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అంబటి రాంబాబు
    తదుపరి వార్తా కథనం
    పోలవరంపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అంబటి రాంబాబు
    దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అంబటి రాంబాబు

    పోలవరంపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అంబటి రాంబాబు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 04, 2023
    09:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రతిష్టాత్మమైన పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

    అంతకుముందు దిల్లీలో గురువారం కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు.

    పోలవరం పునరావాసం ప్యాకేజీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం మంత్రి రాంబాబు ఆంధ్రప్రదేశ్ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

    టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకు చాలా సమయం పడుతుందని చెప్పిన మంత్రి రాంబాబు, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు.

    పోలవరం గైడ్‌బండ్‌ తమ హయాంలోనే కుంగిందని, ఎందుకు అలా జరిగింది అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. జరిగిన తప్పిదాన్ని సరి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

    details

    పోలవరం సందర్శనకు కేంద్ర మంత్రి అంగీకరించారు : అంబటి రాంబాబు 

    గైడ్ బండ్ తప్పిదం కాంట్రాక్టర్ తప్పా, లేక డిజైన్‌ లో లోపం కారణంగా కూలిందా, లేదా భూమి సమస్య అనే అంశాన్ని నిర్థారించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

    అయితే ఒరిజినల్‌ డిజైన్‌లో గైడ్‌ బండ్‌ అనేది లేదని, కొంత కాలానికి దాన్ని జత కలిపారని మంత్రి చెప్పుకొచ్చారు. దీనిపై నిజ నిర్ధారణ కమిటీని నియమించామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పోలవరం ప్రాజెక్టులో తప్పిదాలు జరిగాయన్నారు.

    చంద్రబాబు హయాంలో రాయలసీమలో ఒక్క ప్రాజెక్టుకైనా పునాది వేశారా అని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు కేంద్ర మంత్రి షెకావత్ అంగీకరించారని మంత్రి అంబటి చెప్పుకొచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పోలవరం
    అంబటి రాంబాబు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    పోలవరం

    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
    పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజా వార్తలు
    2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు  గజేంద్ర సింగ్ షెకావత్
    పోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం  తెలంగాణ

    అంబటి రాంబాబు

    మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు సత్తెనపల్లె
    టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    ఆంధ్రప్రదేశ్

    అఖిల్ వర్ధన్‌ హత్య కేసులో సంచలనం.. చంపింది అదే పాఠశాలలోని సీనియర్ విద్యార్థులేనట హత్య
    జనసేనలోకి పంచకర్ల రమేష్ బాబు.. పెందుర్తి బరిలో దిగనున్న వైసీపీ మాజీ జిల్లా ప్రెసిడెంట్ భారతదేశం
    కోనసీమ: బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్, మంటలు    కోనసీమ
    ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని అరికట్టాలంటూ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు నారా లోకేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025