NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Polavaram: ప్రత్యేక ల్యాబ్‌ ఏర్పాటుకు టెండర్లు.. విదేశీ నిపుణుల సిఫార్సులతో చర్యలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Polavaram: ప్రత్యేక ల్యాబ్‌ ఏర్పాటుకు టెండర్లు.. విదేశీ నిపుణుల సిఫార్సులతో చర్యలు
    ప్రత్యేక ల్యాబ్‌ ఏర్పాటుకు టెండర్లు.. విదేశీ నిపుణుల సిఫార్సులతో చర్యలు

    Polavaram: ప్రత్యేక ల్యాబ్‌ ఏర్పాటుకు టెండర్లు.. విదేశీ నిపుణుల సిఫార్సులతో చర్యలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 18, 2025
    09:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యత నియంత్రణ పర్యవేక్షణ బాధ్యతలను ఇకపై మూడో పక్ష సంస్థకు అప్పగించాలనే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.

    ఇందుకోసం ప్రాజెక్టు ప్రాంగణంలోనే ప్రత్యేకంగా ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

    ఈ ల్యాబ్‌ ద్వారా కేంద్ర జలసంఘం, జలవనరుల శాఖ, విదేశీ నిపుణులు సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా టెస్టులు జరిపించి, వారి నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే విధంగా వ్యవస్థ అమలులోకి రానుంది.

    ప్రస్తుతం ఈ పనులను ప్రధానంగా మేఘా కంపెనీ నిర్వహిస్తోంది.డయాఫ్రం వాల్‌ పనులను బావర్‌ సంస్థ చేపడుతుండగా,బట్రస్‌ డ్యామ్‌ నిర్మాణం సహా ఇతర భాగాలను మేఘా కంపెనీ కొనసాగిస్తోంది.

    ఈ క్రమంలో ప్రాజెక్టు పనుల నాణ్యతను గుత్తేదారు సంస్థే పరిశీలించి నివేదికలు సమర్పిస్తోంది.

    వివరాలు 

    మూడు నెలలు గడచినా ల్యాబ్ ఏర్పాటులో పురోగతి లేదు 

    ఈ పనుల్లో వ్యాప్కోస్‌, రాష్ట్ర నాణ్యత నియంత్రణ విభాగం అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

    ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సవాళ్ల పరిష్కారానికి కేంద్ర జలసంఘం, ప్రాజెక్టు అథారిటీ సంయుక్తంగా ఓ విదేశీ నిపుణుల బృందాన్ని నియమించాయి.

    ఈ బృందం డయాఫ్రం వాల్‌ ధ్వంసం, ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో లీకేజీలు, ఇతర సమస్యలపై పరిశోధనలు చేసి నివేదికను సమర్పించింది.

    ఇందులో ప్రాజెక్టులో నాణ్యత నియంత్రణ పద్ధతులపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు స్వతంత్ర ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని సిఫారసు చేశారు.

    అంతేకాకుండా మూడో పక్ష సంస్థ ద్వారా స్వతంత్ర తనిఖీలు జరగాలని స్పష్టంగా సూచించారు. అయితే ఇప్పటికే మూడు నెలలు గడిచినా ల్యాబ్‌ ఏర్పాటు పూర్తికాలేదు.

    వివరాలు 

    రూ. కోటిన్నర వరకు వ్యయం 

    మూడో పక్ష ల్యాబ్‌ ఏర్పాటుకు రాష్ట్ర జలవనరుల శాఖ, ప్రాజెక్టు అథారిటీ అధికారులు కలిసి అవసరమైన వ్యయ అంచనాలు సిద్ధం చేశారు.

    ల్యాబ్‌ ఏర్పాటుకు సుమారుగా రూ.3 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయబడింది.

    అయితే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ల్యాబ్‌ అవసరం ఉండకపోవచ్చని భావించి, స్వతంత్ర సంస్థలే ల్యాబ్‌ ఏర్పాటుచేసి, వారు చేసిన పరీక్షల ప్రకారం మాత్రమే ఛార్జీలు వసూలు చేసే విధంగా ప్రతిపాదనలు రూపొందించారు.

    ల్యాబ్‌ ప్రాజెక్టు పూర్తయ్యాక ఆయా సంస్థలకు చెందుతుంది. వార్షికంగా ఎన్ని పరీక్షలు చేయాలో అంచనా వేయగా, దాదాపుగా రూ.1.50 కోట్లు ఖర్చవుతుందని తేలింది.

    ప్రస్తుతం దీనికి సంబంధించి కొటేషన్లు ఆహ్వానించగా, తిరుపతి ఐఐటీ, నేషనల్‌ బిల్డింగ్‌ కనస్ట్రక్షన్‌ కార్పొరేషన్‌లు ఆసక్తి చూపాయి.

    వివరాలు 

    కుడి వైపు సొరంగాల్లో నిపుణుల తనిఖీ 

    ఈ సంస్థల అర్హతలు, వారు పేర్కొన్న ధరల వివరాలను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.

    పోలవరం ప్రాజెక్టులో భాగంగా కుడివైపు నిర్మిస్తున్న జంట సొరంగాల్లో ఒకటి కుంగిపోయిన నేపథ్యంలో గురువారం నిపుణుల కమిటీ ప్రత్యక్షంగా పరిశీలనలు నిర్వహించింది.

    మట్టి సరైన స్థాయిలో లేనందునే ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు.

    ప్రస్తుతం అక్కడ ప్రత్యామ్నాయ నిర్మాణాల కోసం పరిశీలనలు చేపట్టారు.

    ఈ కమిటీలో కేంద్ర జలసంఘం సీఈ రమేష్‌బాబు,నాణ్యత నియంత్రణ విభాగ సీఈ శేషుబాబు,ఎస్‌ఈ తిరుమలరావు,పోలవరం సీఈ నరసింహమూర్తి, సీఈ సీడీఓ తదితరులు ఉన్నారు.

    సొరంగం కుంగిన ప్రాంతంలో రిబ్స్‌ను ఏర్పాటు చేసి, వాటికి కాంక్రీటు పోసి, తర్వాత లైనింగ్‌ చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియకు కమిటీ ఆమోదం తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పోలవరం

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    పోలవరం

    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్
    పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్
    2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు  ఆంధ్రప్రదేశ్
    పోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025