Page Loader
Polavaram: పోలవరం వద్ద పెరుగుతున్న వరద ఉధృతి 
పోలవరం వద్ద పెరుగుతున్న వరద ఉధృతి

Polavaram: పోలవరం వద్ద పెరుగుతున్న వరద ఉధృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏలూరు జిల్లా లోని పోలవరం వద్ద గోదావరి నది కుడి, ఎడమ గట్లను తాకుతూ వేగంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా గోదావరిలోకి వస్తున్న వరద నీటి పరిమాణం శనివారం నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం అధికారులు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద బుధవారం సాయంత్రానికి నీటి మట్టం 28.40 మీటర్లకు చేరిందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం 48 గేట్ల ద్వారా గోదావరిలోకి తిరిగి 2.35 లక్షల క్యూసెక్కుల వరదనీరు విడుదల చేయబడుతోంది.

వివరాలు 

కుడి కాలువలోకి గరిష్టంగా నీటి విడుదల 

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల 3న పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద ప్రారంభించిన పంపుల ద్వారా నీరు కుడి కాలువలోకి విడుదల అవుతోంది. ఈ నీరు గత ఆరు రోజులుగా సుమారు 175 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణానదిని చేరిందని శాఖ అధికారులు తెలిపారు. బుధవారం నాటికి పంపుల సంఖ్యను 16 నుంచి 19కి పెంచడంతో కుడి కాలువలోకి 6,650 క్యూసెక్కుల వరదనీరు చేరింది అని ఎత్తిపోతల డీఈ సురేష్ తెలిపారు. పంపుల సంఖ్య పెరగడం వల్ల ప్రస్తుతం కుడి కాలువ నీటితో నిండి వేగంగా ప్రవహిస్తోంది.