Jasprit Bumrah: వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా బుమ్రాపై ప్రత్యేక ఫోకస్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా ప్రధాన బౌలింగ్ అస్త్రంగా పేరొందిన జస్ప్రిత్ బుమ్రా సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ ఇటీవల టీ20 ప్రపంచకప్ను గెలుచుకోవడంలో అతడు అత్యంత కీలక పాత్ర పోషించాడు. రాబోయే వన్డే ప్రపంచకప్కు కూడా అతడి సేవలు జట్టుకు ఎంతో అవసరం. అందుకే ఆ మెగా టోర్నీ దృష్ట్యా బుమ్రాను జాగ్రత్తగా సంరక్షించాలనే ఆలోచనలో జట్టు యాజమాన్యం ఉంది. 2027 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ అక్టోబర్-నవంబర్ నెలల్లో సౌతాఫ్రికాలో జరగనుంది. ఈ నేపథ్యంలో బుమ్రా తన దృష్టిని ప్రధానంగా వన్డే ఫార్మాట్పైనే కేంద్రీకరించనున్నాడు. గత 18 నెలల్లో కూడా అతడు టీ20ల కంటే వన్డేలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Details
పనిభారం తగ్గించడానికి ప్లాన్
పనిభారం తగ్గించాలనే ఉద్దేశంతో అతడిని టీ20ల్లో పరిమితంగానే ఆడించాలనే ప్రణాళికను జట్టు యాజమాన్యం పరిశీలిస్తోంది. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే టీమిండియా వన్డే ప్రపంచకప్ సన్నాహకాలను ప్రారంభించనుంది. ఐపీఎల్ అనంతరం జాతీయ సెలక్షన్ కమిటీ, వివిఎస్ ల వి. వి. ఎస్. లక్ష్మణ్ నేతృత్వంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, అలాగే టీమ్ మేనేజ్మెంట్ కలిసి బుమ్రా పనిభార నిర్వహణపై సమగ్ర ప్రణాళిక రూపొందించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ల విషయంలో మాత్రం బుమ్రా రాజీ పడే అవకాశం లేదు. అతడి పనిభార నిర్వహణ గత రెండేళ్లలో ఉన్న విధంగానే కొనసాగుతుందని తెలుస్తోంది.
Details
టీ 20 లకు దూరమయ్యే అవకాశం
ఆ కాలంలో అతడు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ (నవంబర్ 19, 2023) తర్వాత కివీస్తో జరిగిన సిరీస్కు ముందు వరకు బుమ్రా మొత్తం 42 మ్యాచ్ల్లో మాత్రమే ఆడాడు. అందులో 21 టెస్టులు, 21 టీ20లు ఉన్నాయి. ఇక ముందు మాత్రం అతడు టీ20ల కంటే వన్డేలపైనే ఎక్కువ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా పాల్గొనే ఏ అంతర్జాతీయ టోర్నీ అయినా సరే, బుమ్రా ఫిట్నెస్ ఎంతో కీలకం. అందుకే అతడు ఏ ఫార్మాట్లలో ఎక్కువగా ఆడాలన్న ప్రాధాన్య క్రమాన్ని జట్టు మేనేజ్మెంట్ జాగ్రత్తగా నిర్ణయించాలి.
Details
వన్డే ల కోసం ఎక్కువ దృష్టి
టెస్టు క్రికెట్లో అతడు తప్పకుండా ఆడతాడు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం వన్డేలపైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు. భారత్ ఫాస్ట్ బౌలింగ్ విభాగం కూడా అంత విస్తృతంగా లేదని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రధానంగా జస్ప్రిత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రానా వంటి బౌలర్లు ఈ బౌలింగ్ పూల్లో కీలక సభ్యులుగా ఉన్నారు.