NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Polavaram: ఏడేళ్ల తర్వాత పోలవరం బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ
    తదుపరి వార్తా కథనం
    Polavaram: ఏడేళ్ల తర్వాత పోలవరం బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ
    ఏడేళ్ల తర్వాత పోలవరం బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ

    Polavaram: ఏడేళ్ల తర్వాత పోలవరం బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 06, 2025
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పోలవరం నిర్వాసితుల కల ఎట్టకేలకు నెరవేరింది.

    ఏడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పునరావాసం ప్యాకేజీతో పాటు ఇతర నిధులు అందించినా తర్వాత జగన్ సర్కార్‌లో ఈ అంశంపై పెద్దగా చర్చ జరగలేదు.

    తాజాగా కూటమి ప్రభుత్వం వివిధ కేటగిరీల కింద రూ.996.47 కోట్లను పోలవరం నిర్వాసితులకు విడుదల చేసింది.

    ఇందులో పునరావాసం కోసం రూ.586.71 కోట్లు, భూ సేకరణకు రూ.235.23 కోట్లు, నిర్మాణ పనుల కోసం రూ.174.53 కోట్లు ఇవ్వనుంది.

    ఈ మొత్తం రెండు రోజుల్లోనే నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశారు. ఇందులో పునరావాస కాలనీల నిర్మాణ పనుల నిధులు కూడా ఉన్నాయి.

    Details

    5వేల కుటుంబాలకు లబ్ధి

    పోలవరం ప్రాజెక్టు కారణంగా తొలిదశలో ముంపులో చిక్కుకునే గ్రామాల పునరావాసంపై ప్రభుత్వం మొదట దృష్టి సారించింది.

    ఈ గ్రామాల్లో గిరిజనేతరుల పునరావాస ప్యాకేజీ కింద రూ,6.36 లక్షలు, గిరిజనులు, ఎస్సీలకు రూ.6.86 లక్షలు అందజేశారు.

    భూములు ముంపులో చిక్కుకున్నవారికి పరిహారం చెల్లించి భూములను సేకరించారు. ఇంటి స్థలం, నిర్మాణం అవసరం లేదనుకున్న నిర్వాసితులకు రూ.3.85 లక్షలు చెల్లించారు.

    తమకు స్థలం కావాలనీ, తామే ఇల్లు నిర్మించుకుంటామని తెలిపినవారికి రూ.2.85 లక్షలు అందించారు. అయితే పునరావాస కాలనీలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎంచుకున్నవారికి ఆ మొత్తాలు చెల్లించలేదు.

    పునరావాస ప్యాకేజీ మొత్తం 5,000కు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరిందని సమాచారం.

    Details

    కేంద్రం నుంచి అదనపు నిధులు

    తొలి దశలో పోలవరం ప్రాజెక్టు కారణంగా 20,946 కుటుంబాలను, రెండో దశలో 17,114 కుటుంబాలను పునరావాసం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    వారిలో 7,480 కుటుంబాలు తమ సొంత ఇళ్లు నిర్మించుకుంటామని పేర్కొన్నాయి. పోలవరం ప్రాజెక్టు మిగిలిన పనుల కోసం కేంద్రం రూ.12,157 కోట్లు మంజూరు చేసింది.

    ఇందులో అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు విడుదల చేశారు. తాజా విరాళంలో చెల్లించిన రూ. 996.47 కోట్లకు అదనంగా, మరో రూ.2,478 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

    ప్రస్తుతం దాదాపు రూ.1,000 కోట్లను నిర్వాసితుల ఖాతాల్లో జమ చేయడంతో, మరిన్ని నిధుల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పోలవరం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    పోలవరం

    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్
    పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్
    2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు  తాజా వార్తలు
    పోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం  తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    DAJGUA: ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి 878 గ్రామాలు ఎంపిక: దుర్గాదాస్‌ ఉయికే  భారతదేశం
    Andhra Pradesh: ఏపీలో ప్రతిష్టాత్మక 'ఇన్నొవేషన్‌ యూనివర్సిటీ'.. ఫిజిక్స్‌ వాలాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం భారతదేశం
    Heavy Rains: అల్పపీడన ప్రభావం.. ఏపీలో స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు భారీ వర్షాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025