తదుపరి వార్తా కథనం

Polavaram: పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 01, 2025
10:43 am
ఈ వార్తాకథనం ఏంటి
ఎగువ ప్రాంతాల్లో జలవర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, గోదావరి నదిలోకి వరదనీరు చేరుతూ ఉండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం స్థిరంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం ప్రాజెక్టు అధికారులు 48 రేడియల్ గేట్లు తెరిచి 49,477 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతానికి స్పిల్వే ఎగువ భాగంలో నీటిమట్టం 26.450 మీటర్లకు చేరగా, స్పిల్వే దిగువ భాగంలో అది 17.150 మీటర్లుగా నమోదైంది.