NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు 
    తదుపరి వార్తా కథనం
    2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు 
    2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభత్వానికి కేంద్రం గడువు

    2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు 

    వ్రాసిన వారు Stalin
    Jun 02, 2023
    12:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పోలవరం ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దిల్లీలో కీలక సమీక్ష నిర్వహించారు.

    జలశక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), ఏపీ నీటిపారుదల శాఖలోని సీనియర్ అధికారులతో పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

    ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని గజేంద్ర సింగ్ షెకావత్ అధికారులను ఆదేశించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో పనులు ఆలస్యమయ్యాయని అధికారులు వివరించారు.

    అయితే ప్రాజెక్ట్ మొదటి దశ పూర్తి చేయడానికి జూన్ 2024ని మంత్రి గడువుగా నిర్ణయించారు. జూన్, 2025 నాటికి ప్రాజెక్టును మొత్తాన్ని పూర్తి చేయాలని చెప్పారు.

    ఏపీ

    రూ.17,414 కోట్ల అడ్వాన్స్ గ్రాంట్‌ను కోరిన ఏపీ ప్రభుత్వం 

    పోలవరం ప్రాజెక్టును 41.5 మీటర్ల స్థాయికి పూర్తి చేసేందుకు రూ.17,414 కోట్ల అడ్వాన్స్ గ్రాంట్‌ను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పరిగణలోకి తీసుకున్నారు.

    పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన షెకావత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

    డయాఫ్రమ్‌వాల్‌ డిజైన్‌లు సీడబ్ల్యూసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ఏపీ అధికారులు మంత్రికి చెప్పగా.. వెంటనే పనులు ప్రారంభించేందుకు డిజైన్లు క్లియర్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

    ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు పునరావాసం, పునరావాస (ఆర్‌అండ్‌ఆర్‌) పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పోలవరం
    ఆంధ్రప్రదేశ్
    జల‌శక్తి శాఖ మంత్రి

    తాజా

    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌

    పోలవరం

    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్
    పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం  బిహార్
    చేతిపంపు కొట్టుకొని నీళ్లు తాగిన ఏనుగు; వీడియో వైరల్  పార్వతీపురం మన్యం జిల్లా
    వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా తెలంగాణ
    APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ  ఏపీఎస్ఆర్టీసీ

    జల‌శక్తి శాఖ మంత్రి

    వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025