Page Loader
Polavaram: పోలవరం కార్యాలయంలో పైళ్లు దగ్ధం
పోలవరం కార్యాలయంలో పైళ్లు దగ్ధం

Polavaram: పోలవరం కార్యాలయంలో పైళ్లు దగ్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2024
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో పైళ్లు దగ్ధం కావడం కలకలం రేపుతోంది. ఆడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో కీలక పైళ్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయి. రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరంలో వద్దనున్న కార్యాయలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అందులో అవకతవకలు జరగడంతో కొందరు అధికారులు కావాలనే ఈ పనికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Details

విచారణ ప్రారంభించిన డిప్యూటీ కలెక్టర్

భూసేకరణకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారం విషయంలో అక్రమాలు బయటికొస్తానే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.