NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Polavaram: పోలవరం ప్రాజెక్టును 2027 నాటికల్లా పూర్తి.. మరో రూ.12 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధం: సీఆర్‌ పాటిల్‌ 
    తదుపరి వార్తా కథనం
    Polavaram: పోలవరం ప్రాజెక్టును 2027 నాటికల్లా పూర్తి.. మరో రూ.12 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధం: సీఆర్‌ పాటిల్‌ 
    పోలవరం ప్రాజెక్టును 2027 నాటికల్లా పూర్తి

    Polavaram: పోలవరం ప్రాజెక్టును 2027 నాటికల్లా పూర్తి.. మరో రూ.12 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధం: సీఆర్‌ పాటిల్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 06, 2024
    10:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

    ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

    చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత పోలవరం నిర్మాణ పనులు వేగవంతమైందని కేంద్రమంత్రి చెప్పారు.

    త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు ఆయన తెలిపారు.

    ఇప్పటికే పోలవరం నిర్మాణానికి కేంద్రం భారీ నిధులు జారీ చేసింది.

    రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిధులను తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

    ఢిల్లీలో జరిగిన గృహప్రవేశ సమారంభంలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ పై వివరణ ఇచ్చారు.

    వివరాలు 

    ప్రాజెక్టు వ్యయం 70,000కోట్లు

    ఆయన వ్యాఖ్యలతో పోలవరం ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

    కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం,పోలవరం ప్రాజెక్టు ఏపికి జీవనాడి లాంటిదని పేర్కొన్నారు.

    2027నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభం కాబోతోంది,దీన్ని 2026మార్చి నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

    మొత్తం ప్రాజెక్టు వ్యయం 70,000కోట్ల వరకు చేరవచ్చని అంచనా వేశారు.

    గోదావరి,కృష్ణా,పెన్నా నదులను అనుసంధానం చేసే పనులు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా జరుగుతాయి.

    పోలవరం ప్రాజెక్టు పనులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు వేగంగా సాగాయి.

    అయితే, రివర్స్ టెండరింగ్ సమస్య కారణంగా పదిహేడు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. వైసీపీ పాలనలో ప్రాజెక్టు పనులు మందగించినట్టు తెలిపారు.

    వివరాలు 

    2024-25 ఆర్థిక సంవత్సరంలో 12,500 కోట్ల నిధులు

    2014-2019 మధ్య చంద్రబాబు పాలనలో 71.93% పనులు పూర్తయ్యాయని, ఆ తరువాత 2019-2024 మధ్య కేవలం 3.84% మాత్రమే పూర్తయింది అని కేంద్రం గణాంకాలను ప్రకటించింది.

    2024-25 ఆర్థిక సంవత్సరంలో 12,500 కోట్ల నిధులు పోలవరం ప్రాజెక్టు పనులకు కేటాయించబోతున్నామని కేంద్రం ప్రకటించింది.

    వీటితో డయాఫ్రం వాల్ నిర్మాణం సహా కీలకమైన పనులు పూర్తి చేయాలని కేంద్రమంత్రి వెల్లడించారు.

    పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం కూడా పూర్తి అవుతుందని కేంద్రమంత్రి చెప్పారు.

    పాత డయాఫ్రం వాల్ నష్టం కారణంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.1,200 కోట్లు అవసరమని కేంద్రం అంచనా వేసింది.

    వివరాలు 

    ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కోసం రూ.31,500 కోట్లు

    అలాగే, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కోసం రూ.31,500 కోట్లు కావాలని నిర్ణయించింది.

    దీనికోసం కూడా కేంద్రం నిధులు జారీ చేయడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

    వరదలు కారణంగా నీటి లీకేజ్ సమస్య ఎదురైనందున దీనిని నివారించేందుకు నూతన సాంకేతికతను ఉపయోగించాలని నిర్ణయించారు.

    2019-2024 మధ్య వైసీపీ పాలనలో ప్రాజెక్టు నిధులు సరైన విధంగా వినియోగించలేదని విమర్శలు వెల్లువెత్తాయి.

    ఈ ప్రాజెక్టు పూర్తయితే 7.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించబడుతుంది, అలాగే 28.5 లక్షల మందికి తాగు నీరు కూడా అందుతుందని కేంద్రం పేర్కొంది.

    అదనంగా, 960 మేఘావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా కేంద్రం ఈ ప్రాజెక్టును ప్రాధాన్యంగా చూస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పోలవరం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    పోలవరం

    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్
    పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్
    2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు  గజేంద్ర సింగ్ షెకావత్
    పోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025