LOADING...
Telangana: ఉగాదికి మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం.. మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.5,000 కోట్ల ప్రణాళిక
మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.5,000 కోట్ల ప్రణాళిక

Telangana: ఉగాదికి మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం.. మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.5,000 కోట్ల ప్రణాళిక

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2026
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

మూసీ నది పునరుద్ధరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా ముందడుగులు వేస్తోంది. తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజునే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ పనులను అమలు చేసే బాధ్యత వహిస్తున్న మూసీ రివర్‌ ఫ్రంట్‌ కార్పొరేషన్‌ (ఎంఆర్డీసీఎల్‌) అధికారులు విస్తృత స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. మొదటి దశలో హిమాయత్‌సాగర్‌ నుంచి గాంధీ సరోవర్‌ వరకు,అలాగే ఉస్మాన్‌సాగర్‌ నుంచి గాంధీ సరోవర్‌ వరకు కలిపి సుమారు 20 కిలోమీటర్ల మేర నది తీరాన్ని అభివృద్ధి చేసి సుందరీకరించనున్నారు. ఈ దశకు దాదాపు రూ.5,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇందులో రూ.4,100 కోట్లను ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) రుణంగా అందించనుండగా, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.

వివరాలు 

బుద్వేల్‌-కోస్గి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు శ్రీకారం

గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుతో పాటు బుద్వేల్‌ నుంచి కోస్గి వరకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికీ శంకుస్థాపన చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. తెలంగాణలో 81 కిలోమీటర్ల పొడవుతో 4 లేన్లుగా (భవిష్యత్‌లో 6 లేన్లకు విస్తరించగల విధంగా) రూపొందనున్న ఈ రేడియల్‌ రహదారి ఔటర్‌ ఎగ్జిట్‌ 17 బుద్వేల్‌ వద్ద ప్రారంభమై కోస్గి వరకు సాగుతుంది. ఈ మార్గం ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌)ను, ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ట్రిపుల్‌ ఆర్‌)తో అనుసంధానించనుంది. ముఖ్యంగా చందనవెల్లి, పేరారం వంటి పారిశ్రామిక ప్రాంతాల గుండా ఈ రహదారి వెళ్లనుంది.

వివరాలు 

లంగర్‌హౌస్‌ వద్ద గాంధీ సరోవర్‌ నిర్మాణం

లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌ సమీపంలో గాంధీ సరోవర్‌ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. హైదర్షాకోట్‌లోని ఆర్మీ పాఠశాల మార్గం ద్వారా టిప్పుఖాన్‌ బ్రిడ్జి వైపు వెళ్లే ప్రస్తుత రహదారిని ఆర్మీ పాఠశాల వద్ద నిలిపివేసి, నూతన మార్గాన్ని ఏర్పాటు చేసి కొత్త వంతెన నిర్మించి నార్సింగి రోడ్డుకు అనుసంధానించాలనే ప్రణాళిక ఉంది. అక్కడి నుంచి ప్రారంభమై లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌ సమీప నాళా వరకు ఈ ప్రాజెక్టు విస్తరించనుంది.

Advertisement

వివరాలు 

38.09 ఎకరాల భూమి కేంద్ర రక్షణ శాఖకు..

ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర రక్షణ శాఖకు చెందిన 52 ఎకరాల భూమి అవసరమైంది. ఆ భూమిని బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేయగా, 38.09 ఎకరాలను ఇప్పటికే అప్పగించారు. మిగిలిన సైనిక ప్రాంతం, ప్రభుత్వ భూముల్లో ఏర్పాట్ల ప్రక్రియ ప్రారంభమైంది. త్రివేణి సంగమం వద్ద గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో చెట్ల తొలగింపు, స్థల సమతలీకరణ పనులు జరుగుతున్నాయి. టిప్పుఖాన్‌ బ్రిడ్జి సమీపంలో ప్రాజెక్టు ప్రారంభ స్థలంతో పాటు ప్రతిపాదిత అధునాతన స్ప్రింగ్‌ బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాల్లో జేసీబీల సహాయంతో చెట్ల తొలగింపు కార్యక్రమాలు అధికారులు ప్రారంభించారు.

Advertisement