తదుపరి వార్తా కథనం

Chandrababu: చంద్రబాబు పోలవరం పర్యటన.. ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 16, 2024
12:41 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు పనులను విహంగ వీక్షణం ద్వారా సమీక్షించారు.
ఈ సందర్శనలో భాగంగా ఆయన ప్రాజెక్టు పురోగతిని, పునరావాసాన్ని పరిశీలించడానికి అధికారులు, ఇంజినీర్లతో సమావేశమై పలు కీలక సూచనలిచ్చారు.
సీఎం పర్యటన ద్వారా, పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారం వంటి అంశాలపై స్పష్టత రావడం అనేక రైతులు, నిర్వాసితులకి ఆశలు కలిగిస్తోంది.
2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కూటమి సర్కారం వేగంగా చర్యలు తీసుకుంటోంది.
ఈ దిశగా చేపట్టవలసిన పనుల షెడ్యూల్ను ముఖ్యమంత్రి త్వరలో వెల్లడించనున్నారు.