Page Loader
Polavaram: హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం.. కీలక అంశాలపై చర్చ
హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం.. కీలక అంశాలపై చర్చ

Polavaram: హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం.. కీలక అంశాలపై చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరిగింది.ఈ భేటీకి ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఇంజినీరింగ్ చీఫ్ అనిల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ప్రధాన ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోలవరం పనుల పురోగతి, మొత్తం అంచనా వ్యయం, నిధుల సమీకరణ, ఇతర కీలక అంశాలపై చర్చ సాగినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రాంతాల గుర్తింపు, పోలవరం బ్యాక్ వాటర్స్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణ అధికారులు ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తమ అభ్యంతరాలను మరోసారి స్పష్టంగా వ్యక్తపరిచారు.

వివరాలు 

నీటి స్థాయిలపై సమగ్రంగా అధ్యయనం

పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం గురించి చర్చ జరగగా, కిన్నెరసాని, ముర్రేడువాగు సహా ఇతర ఉపనదుల పరిస్థితులపై చర్చించారట. పోలవరం బ్యాక్ వాటర్స్ వల్ల ఖమ్మం, భద్రాచలం పట్టణాలు ఎదుర్కొనే ప్రభావం, అలాగే రామాలయం వద్ద నీటి మట్టం, మణుగూరు థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద నీటి స్థాయిలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని తెలంగాణ అధికారులు కోరారు. గతేడాది వచ్చిన వరదల కారణంగా ఎదురైన ముంపును దృష్టిలో ఉంచుకొని ఈ అధ్యయనం విస్తృతంగా జరగాలనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేస్తే, తెలంగాణపై దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవడానికి స్పష్టమైన విశ్లేషణ అవసరమని అధికారుల అభిప్రాయం.