NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Polavaram: హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం.. కీలక అంశాలపై చర్చ
    తదుపరి వార్తా కథనం
    Polavaram: హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం.. కీలక అంశాలపై చర్చ
    హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం.. కీలక అంశాలపై చర్చ

    Polavaram: హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం.. కీలక అంశాలపై చర్చ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 08, 2025
    04:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరిగింది.ఈ భేటీకి ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వం వహించారు.

    ఈ సమావేశంలో తెలంగాణ ఇంజినీరింగ్ చీఫ్ అనిల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ప్రధాన ఇంజినీర్లు పాల్గొన్నారు.

    ఈ సమావేశంలో పోలవరం పనుల పురోగతి, మొత్తం అంచనా వ్యయం, నిధుల సమీకరణ, ఇతర కీలక అంశాలపై చర్చ సాగినట్లు సమాచారం.

    ముఖ్యంగా తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రాంతాల గుర్తింపు, పోలవరం బ్యాక్ వాటర్స్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

    తెలంగాణ అధికారులు ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తమ అభ్యంతరాలను మరోసారి స్పష్టంగా వ్యక్తపరిచారు.

    వివరాలు 

    నీటి స్థాయిలపై సమగ్రంగా అధ్యయనం

    పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం గురించి చర్చ జరగగా, కిన్నెరసాని, ముర్రేడువాగు సహా ఇతర ఉపనదుల పరిస్థితులపై చర్చించారట.

    పోలవరం బ్యాక్ వాటర్స్ వల్ల ఖమ్మం, భద్రాచలం పట్టణాలు ఎదుర్కొనే ప్రభావం, అలాగే రామాలయం వద్ద నీటి మట్టం, మణుగూరు థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద నీటి స్థాయిలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని తెలంగాణ అధికారులు కోరారు.

    గతేడాది వచ్చిన వరదల కారణంగా ఎదురైన ముంపును దృష్టిలో ఉంచుకొని ఈ అధ్యయనం విస్తృతంగా జరగాలనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.

    పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేస్తే, తెలంగాణపై దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవడానికి స్పష్టమైన విశ్లేషణ అవసరమని అధికారుల అభిప్రాయం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    పోలవరం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    హైదరాబాద్

    GBS case: హైదరాబాద్‌లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ తొలి కేసు నమోదు భారతదేశం
    MMTS: చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లు.. కొత్త సర్వీసుల ప్రారంభం!  తెలంగాణ
    Hyderabad: మీ ఫోన్లో ఆ యాప్ ఉంటే చాలు.. హైదరాబాద్ సిటీ బస్సుల సమాచారం మీరు ఇంట్లోనే తెలుసుకోవచ్చు! భారతదేశం
    House sales: హైదరాబాద్‌లో స్థిరంగా నివాస గృహాల మార్కెట్‌.. 'స్క్వేర్‌ యార్డ్స్‌' నివేదిక  భారతదేశం

    పోలవరం

    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్
    పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్
    2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు  ఆంధ్రప్రదేశ్
    పోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025