NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Polavaram: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి మూడో కట్టర్‌.. ఈ నెల 7 నుంచి రంగంలోకి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Polavaram: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి మూడో కట్టర్‌.. ఈ నెల 7 నుంచి రంగంలోకి

    Polavaram: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి మూడో కట్టర్‌.. ఈ నెల 7 నుంచి రంగంలోకి

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 02, 2025
    09:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పోలవరం ప్రాజెక్టులో కీలక భాగమైన డయాఫ్రం వాల్ నిర్మాణానికి అవసరమైన మూడవ కట్టర్ యంత్రం, ఏప్రిల్‌ నెల నుంచే ప్రాజెక్టు ప్రాంగణానికి చేరాల్సి ఉండగా, అది ఒక్క నెల ఆలస్యంగా ఇప్పుడు అక్కడికి చేరుకుంటోంది.

    మొత్తం 1,396.60 మీటర్ల మేర ఈ డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికే పూర్తి చేయాలి.

    ఈ గడువు మేరకు పనులు పూర్తి చేయాలంటే, ఏప్రిల్ నుంచే బావర్ కంపెనీ మూడవ కట్టర్, గ్రాబర్ల సహాయంతో పని ప్రారంభించాల్సి ఉంది.

    అయితే, ఆలస్యంగా వచ్చిన ఈ కట్టర్‌లోని కొన్ని పరికరాలు గురువారం ప్రాజెక్టు వద్దకు చేరాయి. మిగతా పరికరాలు త్వరలో రానున్నాయి.

    వివరాలు 

    ప్రధాన డ్యాం రెండో భాగం పనులు

    ఇవన్నింటిని అసెంబుల్ చేసి ఈ నెల 7వ తేదీ నుంచి మొత్తం మూడు కట్టర్ల సహాయంతో పనులు ప్రారంభించనున్నారు.

    డయాఫ్రం వాల్ నిర్మాణంలో పురోగతే, ప్రధాన డ్యాం నిర్మాణం, ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయడాన్ని నిర్ధారించనుంది.

    డయాఫ్రం వాల్ నిర్మాణంతోపాటు, నవంబర్ నుంచే ప్రధాన డ్యాం రెండో భాగం పనులు కూడా ప్రారంభించాలన్న ఆలోచన ఉంది.

    ఈ నెల 4వ తేదీ నుంచి ప్రాజెక్టు ప్రాంగణానికి విదేశీ నిపుణుల బృందం రానుండటంతో, డిజైన్‌లు, నిర్మాణానికి సంబంధించిన కీలక చర్చలు జరగనున్నాయి.

    ప్రస్తుతం డయాఫ్రం వాల్‌కు సంబంధించిన మొత్తం 1,396.60 మీటర్లలో 230 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.

    వివరాలు 

    తగ్గిన పనుల వేగం

    ఈ వాల్ నిర్మాణానికి గోదావరి నదీగర్భంలో కొన్ని చోట్ల 20 మీటర్ల లోతు వరకు, మరికొన్ని ప్రాంతాల్లో 90 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేయాల్సి ఉంటుంది.

    రాయి తగిలే వరకు ప్యానెల్‌ను తవ్వి, ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ కాంక్రీటుతో నింపాల్సి ఉంటుంది.

    ఫిబ్రవరి,మార్చి నెలల్లో మంచి పురోగతి సాధించినప్పటికీ, ఏప్రిల్‌లో మూడవ కట్టర్ లేకపోవడం వల్ల పనుల వేగం తగ్గింది.

    అయినా, మూడవ కట్టర్ వచ్చాక పనులు వేగంగా సాగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    వివరాలు 

    ఎలాంటి రాయి తగిలే వరకు పరిగణనలోకి తీసుకోవాలి? 

    నదీగర్భంలో రాయి తగిలిన తరువాత కొన్ని ప్రాంతాల్లో 2 మీటర్లు, మరికొన్ని చోట్ల 3.5 మీటర్ల లోతు వరకు ప్యానెల్‌ను పంపి, ప్లాస్టిక్ కాంక్రీటుతో నింపాల్సి ఉంటుంది.

    ప్రాజెక్టు పనులను మేఘా కంపెనీ నిర్వహిస్తుండగా,డయాఫ్రం వాల్ నిర్మాణంలో నైపుణ్యం కలిగిన జర్మన్ సంస్థకు ఈ పనులు అప్పగించారు.

    ఈ రెండు సంస్థల మధ్య స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల మెత్తని రాయి తగిలిన దగ్గర 2 మీటర్ల లోతుకే పని చేయడంపై చర్చ జరుగుతోంది.

    అధికారుల అభిప్రాయం ప్రకారం, ఇది మెత్తని రాయిగా పరిగణించాలి, గట్టి రాయి తగిలే వరకు కొనసాగించాల్సిందే.

    వివరాలు 

    ఎంత లోతు వరకు ప్యానెల్ దింపాలి

    ఈ విషయంలో స్పష్టత కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ నుండి నిపుణులను నియమించారు.

    వారు తమ అభిప్రాయం తెలపగా, గుత్తేదారు సంస్థ ప్రతినిధులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

    ఈ నేపథ్యంలో, పోలవరం అధికారులు ఈ అంశాన్ని కేంద్ర జలసంఘానికి నివేదించి, "ఎలాంటి రాయిని పరిగణనలోకి తీసుకోవాలి?" "రాయి తగిలిన తర్వాత ఎంత లోతు వరకు ప్యానెల్ దింపాలి?" అనే అంశాలపై స్పష్టమైన మార్గనిర్దేశం కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పోలవరం

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    పోలవరం

    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్
    పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్
    2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు  ఆంధ్రప్రదేశ్
    పోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025