NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu :నేడు పోలవరం పర్యటనకు చంద్రబాబు.. ప్రాజెక్టు పరిశీలన, సమీక్ష 
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu :నేడు పోలవరం పర్యటనకు చంద్రబాబు.. ప్రాజెక్టు పరిశీలన, సమీక్ష 
    నేడు పోలవరం పర్యటనకు చంద్రబాబు.. ప్రాజెక్టు పరిశీలన, సమీక్ష

    CM Chandrababu :నేడు పోలవరం పర్యటనకు చంద్రబాబు.. ప్రాజెక్టు పరిశీలన, సమీక్ష 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 17, 2024
    08:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌కి రెండోసారి సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలి సారి పోలవరం పర్యటనకు వెళ్తున్నారు.

    ఈ రోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించి వాటి ప్రస్తుత స్థితిగతులను జలవనరులశాఖ అధికారులతో సమీక్షించనున్నారు.

    పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పూనుకున్నారు.

    ఈ ప్రాజెక్టును వీరిద్దరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మొదటి పర్యటనను పోలవరంతో ప్రారంభించనున్నారు.

    వివరాలు 

    పోలవరంలో అధికారులతో మంత్రి రామానాయుడు సమీక్ష 

    పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదివారం పోలవరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలకు వెళ్తారని, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేస్తారని తెలిపారు.

    ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణిని మంత్రి ఆదేశించారు.

    ఆయన పర్యటనకు పకడ్బందీ భద్రత కల్పించాలని ఎస్పీ మేరీ ప్రశాంతిని ఆదేశించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం.సూర్యతేజ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

    వివరాలు 

    సీఎం పర్యటన ఏర్పాట్లపై జేసీ సమీక్ష 

    సోమవారం పోలవరం ప్రాజెక్టు డ్యాం సైట్‌లో ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

    జేసీ లావణ్య వేణి మాట్లాడుతూ.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏలూరు జిల్లాలో సీఎం చేసే తొలి పర్యటనను అధికారులు విజయవంతం చేయాలని సూచించారు.

    వివరాలు 

    పోలవరం డ్యాం ప్రాంతంలో పనుల పురోగతిపై పరిశీలన 

    ఈ రోజు ఉదయం పోలవరం డ్యాం వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు ముఖ్యమంత్రి చేరుకుంటారు. ప్రజాప్రతినిధులు, తదితరులతో సమావేశమైన అనంతరం ప్రాజెక్టు పనులను వ్యూ పాయింట్‌ నుంచి పరిశీలిస్తారు.

    అనంతరం పోలవరం డ్యాం ప్రాంతంలో జరుగుతున్న పలు పనుల పురోగతిని పరిశీలించనున్నారు. స్పిల్‌వే, గైడ్ బండ్, గ్యాప్ ఒకటి, రెండు, మూడు, ఎగువ స్ట్రీమ్ కాఫర్‌డ్యామ్, దిగువ కాఫర్‌డ్యామ్, పవర్ హౌస్‌లను పరిశీలిస్తారు.

    ముఖ్యమంత్రి పరిశీలించిన పనులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    పోలవరం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    చంద్రబాబు నాయుడు

    #Chandrababu - KCR: కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    Chandra Babu: సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ.. జనవరి 17కు వాయిదా సుప్రీంకోర్టు
    Chandrababu: ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: చంద్రబాబు  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Chandrababu Naidu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ నేతలు తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    పోలవరం

    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
    పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజా వార్తలు
    2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు  తాజా వార్తలు
    పోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025