
CR Patil: పోలవరం-బనకచర్లపై రెండు రాష్ట్రాలతో సమావేశం.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టులపై త్వరలోనే నిర్ణయాత్మక చర్చలు జరగనున్నాయి. మరో వారం లేదా పది రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సమావేశం జరగనుందని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం పదకొండు సంవత్సరాల కాలంలో జలశక్తి శాఖ సాధించిన ప్రగతిపై గురువారం నాడు ఢిల్లీలో ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు.
వివరాలు
అంశంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు
ఈ సందర్భంగా జలవివాదాలపై మంత్రి పాటిల్ స్పందిస్తూ... ''ఇప్పటికే మేం రెండు రాష్ట్రాలతో సంప్రదించాం. ఈ సమస్యలపై చర్చించేందుకు వారు ముందుకొచ్చారు. అందుకే మేం వచ్చే పది రోజుల్లోపు ఈ అంశంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. నదుల జలాలపై వివిధ అంశాలు రాజకీయంగా మారుతున్న నేపథ్యంలో, ఈ విషయాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత సమయం అవసరం అవుతుంది. కొంత వెనకాముందు ఆలోచించే పరిస్థితులు సహజంగా ఏర్పడతాయి. అయినప్పటికీ చివరికి అన్ని సమస్యలకు సమాధానాలు దొరుకుతాయన్న నమ్మకం మాకు ఉంది'' అని మంత్రి వ్యాఖ్యానించారు.