Loading...
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ఉధంపూర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉధంపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ విషయాన్ని గురువారం అధికారులు వెల్లడించారు. మృతులుగా గుర్తించిన ఇద్దరు ఉగ్రవాదుల పూర్తి వివరాలను నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది.

వివరాలు 

ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు

మజల్తా ప్రాంతంలోని మారుమూల బ్రాటెల్ సోన్, ఖుబ్బన్ ప్రాంతాల్లో అనుమానిత ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో బుధవారం రాత్రి సుమారు 9 గంటలకు సంయుక్త గాలింపు ఆపరేషన్ ప్రారంభించారు.

భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు కలిసి ఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.

ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.

రాత్రి సమయంలో అనుమానిత ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని బలగాలు కాల్పులు జరిపాయి.

ఆ సమయంలో పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించినట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం

ఎన్‌కౌంటర్ అనంతరం భద్రతా బలగాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

అయితే హతమైన ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

అటవీ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారా అనే కోణంలోనూ బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో విస్తృతంగా గాలింపు కొనసాగుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

బడ్గామ్‌లోనూ ఉగ్రవాది హతం

ఇదిలా ఉండగా.. ఈ నెల ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్‌లోని బడ్గామ్ జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఎ-తయిబా (LeT) కమాండర్ హతమయ్యాడు.

జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆపరేషన్ అష్దార్‌లో హతమైన ఉగ్రవాదిని యాసిర్‌గా గుర్తించారు.

అతడు పాకిస్థాన్‌కు చెందినవాడని, లష్కర్-ఎ-తయిబాతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ఉగ్రవాదుల ఉనికిపై సమాచారం అందడంతో స్పెషల్ ఫోర్సెస్, 53 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి.

ఈ క్రమంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

యూస్‌మార్గ్‌లో కదలికలపై నిఘా

భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. యాసిర్‌కు గతంలో సులేమాన్ మూసా గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయి.

అయితే సుమారు ఏడాది క్రితం ఆ గ్రూప్ నుంచి విడిపోయి స్వతంత్రంగా కార్యకలాపాలు కొనసాగించినట్లు తెలుస్తోంది.

యూస్‌మార్గ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో అతని కదలికలపై భద్రతా సంస్థలు కొంతకాలంగా నిఘా ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో చేపట్టిన గాలింపు ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌కు దారితీసింది.

ప్రస్తుతం ఉధంపూర్ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.

ADVERTISEMENT