LOADING...
21 killed: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్‌లో మంటలు.. 21 మంది మృతి
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్‌లో మంటలు.. 21 మంది మృతి

21 killed: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్‌లో మంటలు.. 21 మంది మృతి

వ్రాసిన వారు Moogati Shabari
Jun 03, 2026
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. హోటల్ భవనం బేస్‌మెంట్‌లో ఈ రెస్టారెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఉదయం సుమారు 9:45 గంటల సమయంలో ఈ ఘటన గురించి ఢిల్లీ ఫైర్ సర్వీస్ (డీఎఫ్‌ఎస్)కు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడానికి మొత్తం 10 అగ్నిమాపక వాహనాలను ఘటనాస్థలికి పంపించారు.

వివరాలు

సురక్షితంగా 47 మంది..

ఘటనపై మీడియాతో మాట్లాడిన ఎస్‌డీఎం, డీడీఎంఏ అధికారి జితేంద్ర కుమార్ కీలక వివరాలు వెల్లడించారు. భవనం పైఅంతస్తుల్లో ఉన్న కొందరు వ్యక్తులు ప్రాణాలు కాపాడుకునేందుకు కిందకు దూకారని తెలిపారు. స్థానికులు రోడ్డుపై పరుపులు ఏర్పాటు చేయడంతో వారు వాటిపైకి దూకి బయటపడ్డారని చెప్పారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో రెస్టారెంట్ నడుస్తోందని కూడా ఆయన ధృవీకరించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 47 మందిని సురక్షితంగా రక్షించినట్లు బీజేపీ ఎమ్మెల్యే సతీష్ ఉపాధ్యాయ తెలిపారు. వైద్య చికిత్స కోసం వచ్చిన బంగ్లాదేశ్ పౌరులతో పాటు సార్క్ దేశాలకు చెందిన పలువురు వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారని ఆయన ఏఎన్‌ఐకి వెల్లడించారు.

వివరాలు

ఇరుకైన వీధులే కారణమా?

ఈ హోటల్ హౌజ్ రాణి ప్రాంతంలోని ఇరుకైన వీధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం, హోటల్‌లో సుమారు 25 గదులు ఉండగా, దాదాపు 40 మంది అతిథులు అక్కడ బస చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వైద్య చికిత్స కోసం భారత్‌కు వచ్చిన విదేశీయులేనని చెబుతున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో హోటల్‌లో ఉన్న చాలా మంది నిద్రలో ఉన్నట్లు సమాచారం. కాగా, మంటలు ఎలా చెలరేగాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Advertisement

వివరాలు

హోటల్ నిర్వహణపై కూడా ప్రశ్నలు..

ఇదిలా ఉండగా, ఈ హోటల్ నిర్వహణపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇండియా టుడేకు అందిన సమాచారం ప్రకారం, ఢిల్లీ ప్రభుత్వం బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పథకం కింద కేవలం ఆరు గదులు మాత్రమే నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, హోటల్ యాజమాన్యం బేస్‌మెంట్‌లోని కొన్ని గదులతో కలిపి మొత్తం 25 గదులను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో లైసెన్సింగ్ నిబంధనలు, భద్రతా ప్రమాణాల అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన అనంతరం వెలుగులోకి వచ్చిన దృశ్యాలు భయానక పరిస్థితులను చూపించాయి. భవనం బయట భాగం పూర్తిగా కాలిపోయి కనిపించగా, కిటికీలు పొగతో నల్లగా మారిపోయాయి. మరోవైపు, ప్రాణాలు దక్కించుకునేందుకు ఇద్దరు వ్యక్తులు బాల్కనీ నుంచి కిందకు దూకిన దృశ్యాలు కూడా కనిపించాయి.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్..

Advertisement