NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi : ఢిల్లీ మహిళా కమిషన్ నుండి 223 మంది ఉద్యోగుల తొలగింపు.. LG ఆదేశాలు 
    తదుపరి వార్తా కథనం
    Delhi : ఢిల్లీ మహిళా కమిషన్ నుండి 223 మంది ఉద్యోగుల తొలగింపు.. LG ఆదేశాలు 
    ఢిల్లీ మహిళా కమిషన్ నుండి 223 మంది ఉద్యోగుల తొలగింపు.. LG ఆదేశాలు

    Delhi : ఢిల్లీ మహిళా కమిషన్ నుండి 223 మంది ఉద్యోగుల తొలగింపు.. LG ఆదేశాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 02, 2024
    12:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ మహిళా కమిషన్ ఉద్యోగులపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీవ్ర చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 మంది ఉద్యోగులను ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా తొలగించారు.

    ఎల్జీ ఆదేశాల మేరకు ఢిల్లీ మహిళా కమిషన్ 223 మంది ఉద్యోగులను తక్షణమే తొలగించింది.

    వాస్తవానికి, ఈ ఉద్యోగులందరూ ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ద్వారా నియమించబడిన ఉద్యోగులు.

    నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ అనుమతి లేకుండా వారిని నియమించారని ఆరోపించారు.

    Details 

    మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గా స్వాతి మలివాల్ రాజీనామా 

    ఈ క్రమంలో ఢిల్లీ మహిళా కమిషన్ చట్టాన్ని ఉదహరించారు. కమిషన్‌లో కేవలం 40 పోస్టులు మాత్రమే మంజూరయ్యాయని, కాంట్రాక్ట్‌పై ఉద్యోగులను నియమించుకునే హక్కు డీసీడబ్ల్యూకి లేదని పేర్కొంది.

    ఢిల్లీ మహిళా కమిషన్ విభాగం అదనపు డైరెక్టర్ జారీ చేసిన ఈ ఉత్తర్వులో, కొత్త నియామకాలకు ముందు, అవసరమైన పోస్టుల మూల్యాంకనం జరగలేదని లేదా అదనపు ఆర్థిక భారం కోసం అనుమతి తీసుకోలేదని కూడా పేర్కొన్నారు.

    ఫిబ్రవరి 2017లో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.

    ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ.. ఈ ఏడాది జనవరి 5న ఆమె తన పదవికి రాజీనామా చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    దిల్లీ

    Raisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి? నరేంద్ర మోదీ
    Delhi: ద్వారకా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, మరొకరి తీవ్ర గాయాలు అగ్నిప్రమాదం
    Farmers protest: 'దిల్లీ మార్చ్' ఫిబ్రవరి 29కి వాయిదా.. నేడు సరిహద్దులో కొవ్వొత్తల ర్యాలీ తాజా వార్తలు
    Delhi: వీధి కుక్కుల దాడిలో రెండేళ్ల బాలిక మృతి  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025