NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక
    తదుపరి వార్తా కథనం
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక

    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక

    వ్రాసిన వారు Stalin
    Mar 12, 2023
    02:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన విరాళాలపై ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న ఎన్‌జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) కీలక నివేదికను విడుదల చేసింది.

    2021-22ఆర్థిక సంవత్సరానికి గానూ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి రూ.2,172కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్లు ఏడీఆర్ పేర్కొంది. ఇది వారి మొత్తం ఆదాయంలో 66.04శాతంగా ఉందని వివరించింది

    ప్రధానంగా ఏడు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, ఎన్‌పీపీ వార్షిక ఆడిట్ నివేదికలో విరాళాలు ఎవరు ఇచ్చారో వెల్లడించకుండానే ఆదాయాలను ప్రకటించారని ఏడీఆర్ తెలిపింది.

    రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్‌లు, కూపన్‌ల విక్రయం, రిలీఫ్ ఫండ్‌లు, ఇతర ఆదాయాలు, స్వచ్ఛంద విరాళాలు ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి.

    రాజకీయ పార్టీలు

    అజ్ఞాత విరాళాల్లో 53.45 శాతంతో బీజేపీనే టాప్

    అజ్ఞాత వ్యక్తులు పార్టీలకు పంపిన మొత్తం విరాళాల్లో రూ.1,811.94కోట్లు లేదా 83.41శాతం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చినట్లు ఏడీఆర్ తెలిపింది.

    2020-21లో జాతీయ, ప్రాంతీయ పార్టీలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన విరాళాలు రూ.690.67కోట్లుగా ఉన్నాయి.

    రాజకీయ పార్టీలు రూ. 20,000కంటే తక్కువ విరాళం ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థల పేర్లను, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళం ఇచ్చే వారి పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదు. అందుకే వార్షిక నివేదికలో విరాళాలు ఇచ్చిన వారి పేర్లను వెల్లడించలేదని ఏడీఆర్ చెప్పింది.

    అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన విరాళాల్లో బీజేపీ టాప్ ప్లేస్‌లో ఉంది. అజ్ఞాత వ్యక్తుల నుంచి రూ.1,161కోట్ల విరాళాలు వచ్చినట్లు బీజేపీ ప్రకటించింది. మొత్తంలో ఇది 53.45శాతం. రెండోస్థానంలో రూ.528కోట్లతో(24.31శాతం) రెండోస్థానంలో ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    ఎన్నికలు
    కాంగ్రెస్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    బీజేపీ

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? నరేంద్ర మోదీ
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు విమానం

    ఎన్నికలు

    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ మమతా బెనర్జీ

    కాంగ్రెస్

    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ దిల్లీ
    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు జమ్ముకశ్మీర్
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కేరళ
    సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం' రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025