NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేరళ: వీధి కుక్కల దాడిలో 11ఏళ్ల మూగ బాలుడు మృతి 
    తదుపరి వార్తా కథనం
    కేరళ: వీధి కుక్కల దాడిలో 11ఏళ్ల మూగ బాలుడు మృతి 
    కేరళ: వీధి కుక్కల దాడిలో 11ఏళ్ల మూగ బాలుడు మృతి

    కేరళ: వీధి కుక్కల దాడిలో 11ఏళ్ల మూగ బాలుడు మృతి 

    వ్రాసిన వారు Stalin
    Jun 12, 2023
    06:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళలోని కన్నూర్ జిల్లాలోని ముజప్పిలంగడ్‌లో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడికి 11ఏళ్ల మూగ బాలుడు బలయ్యాడు.

    ఈ ఘటన ఆదివారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎడక్కాడ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

    బాలుడు నిహాల్, ఆదివారం రాత్రి తన ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో అతను తిరిగి రాకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు, స్థానికులు వెతకడం ప్రారంభించారు.

    ముజప్పిలంగాడ్ పట్టణంలో రాత్రి 8 గంటలకు ఆ బాలుడు ఓ మైదానంలో అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

    కేరళ

    వీధికుక్కలను చంపడం పరిష్కారం కాదు: ముఖ్యమంత్రి విజయన్

    చాలా గంటలు ఆ ప్రాంతాన్ని శోధించిన తర్వాత బాలుడి మృతదేహం కనపడినట్లు ఒక పోలీసు అధికారి చెప్పారు.

    బాలుడి శరీరంపై కుక్క కాటుకు గురైనట్లు కనిపించే గుర్తులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలిపారు.

    పోలీసులు తదుపరి విచారణ చేపట్టినట్లు వివరించారు. గత ఏడాది కేరళలోని కొట్టాయంలో ఇదే తరహాలో 12 ఏళ్ల మైనర్ కూడా వీధి కుక్కల దాడిలో మరణించాడు.

    ఈ వీధికుక్కల ఘటనలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, వీధికుక్కలను చంపడం సమస్యకు ఆచరణీయమైన పరిష్కారం కాదని, శాస్త్రీయమైన పరిష్కారం కావాలని పేర్కొన్నారు.

    ఇలాంటి కుక్కల దాడులు ఇటీవలి సంవత్సరాలలో దేశవ్యాప్తంగా అకస్మాత్తుగా పెరిగాయి, కొన్ని ఘటనల్లో మనుషులను చంపుతున్నాయన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా

    కేరళ

    ఆపరేషన్ 'పీఎఫ్ఐ'.. కేరళ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు భారతదేశం
    కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా? భారతదేశం
    ఇక ఉపాధ్యాయులను 'సార్', 'మేడమ్' అని పిలవరు, కేరళ పాఠశాలల్లో కొత్త ఒరవడి భారతదేశం
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కాంగ్రెస్

    తాజా వార్తలు

    బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ! కర్ణాటక
    బ్రిజ్ భూషణ్ సింగ్‌ కేసు కీలక మలుపు; ఆ రెజ్లర్ మైనర్ కాదట రెజ్లింగ్
    IATA: ఎయిర్‌లైన్ పరిశ్రమలో జోష్; ఈ ఏడాది లాభం రూ.80వేల కోట్లు దాటొచ్చని అంచనా  విమానం
    36 గంటల తర్వాత రష్యా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఎయిర్ ఇండియా

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  జొమాటో
    ఎండల నుంచి ఉపశమనం; ఉత్తర భారతం, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఐఎండీ
    యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు  తెలంగాణ
    త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025