కేరళ: వార్తలు

కేరళ: బీజేపీ నాయకుడి ఇంట్లో బాంబు పేలుడు

కేరళలోని కన్నూర్ జిల్లా కక్కయంగడ్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు కలకలం రేపింది. అయితే ఈ ఘటన ఒక బీజేపీ నాయకుడి ఇంట్లో జరగడం గమనార్హం. ఆదివారం సాయంత్రం ముజక్కున్ను పోలీస్ స్టేషన్ పరిధిలో సంభవించిన ఘటనలో దంపతులు గాయపడ్డారు.

1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్

బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని కొచ్చి విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ గురువారం తెలిపింది. వాయనాడ్‌కు చెందిన షఫీ అనే వ్యక్తిని 1,487 గ్రాముల బంగారంతో కొచ్చిలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కేరళలో మ్యాన్‌హోల్ శుభ్రం చేయడానికి కోసం రోబోటిక్ స్కావెంజర్‌

మాన్యువల్ స్కావెంజింగ్ అనేది భారతదేశంలో మామూలే, హానికరమైన వాయువుల వలన ఈ పని చేసే వారి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. భారతదేశంలో 2017 నుండి సుమారు 400 మంది ఈ మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రపరిచే క్రమంలో మరణించారు. ఈ సమస్యకు పరిష్కారంగా కేరళ ప్రభుత్వం మ్యాన్‌హోల్స్‌లోని మురుగునీటిని శుభ్రపరిచే బాండికూట్ అనే రోబోటిక్ స్కావెంజర్‌ను ప్రారంభించింది. త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్‌లో ఈ రోబో మ్యాన్‌హోల్ శుభ్రం చేసే కార్మికులకు విశ్రాంతిని అందిస్తోంది.

రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం పూర్తిస్థాయి ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

23 Feb 2023

టీకా

చిన్నారి వైద్యం కోసం పేరు చెప్పకుండా రూ.11కోట్లు విరాళంగా ఇచ్చిన దాత

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స నిమిత్తం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.11కోట్లను విరాళంగా ఇచ్చాడు. అంత మొత్తం ఇచ్చిన వ్యక్తి అతని పేరు చెప్పకపోవడం గమనార్హం.

15 Feb 2023

ఎన్ఐఏ

ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బుధవారం దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసీస్‌తో సంబంధాలున్న వారే లక్ష్యంగా మొత్తం కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.

బిడ్డకు జన్మనిచ్చిన జహాద్, దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులైన టాన్స్‌జెండర్ జంట

దేశంలోనే తొలిసారిగా కేరళకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ జంట తల్లి దండ్రులయ్యారు. జహాద్ బుధవారం కేరళలోని కోజికోడ్ ప్రభుత్వాస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే పుట్టిన బిడ్డ ఆడ, మగ అనేది జియా పావల్, జహాద్ జంట వెల్లడించలేదు.

కేరళలో మరో మూడు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు

భారతి ఎయిర్‌టెల్ తన 5G సేవలను కేరళలోని కోజికోడ్, త్రివేండ్రం, త్రిస్సూర్‌లో విడుదల నగరాల్లో ప్రారంభించింది. ఈ నగరాల్లో ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ప్రస్తుత 4G నెట్‌వర్క్ కంటే 20-30 రెట్లు వేగవంతమైన వేగంతో ఆనందించవచ్చు. ప్రస్తుతం ఎయిర్ టెల్ తన 5G డేటా ప్లాన్‌లను ఇంకా వెల్లడించలేదు.

కేరళ: దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న టాన్స్‌జెండర్ జంట

దేశంలోనే తొలిసారిగా కేరళకు చెందిన ఓ ట్రాన్స్ మన్ తల్లి కాబోతోంది. గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న జహాద్, జియా పావల్ తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. మార్చిలో జహ్హాద్ తమ బిడ్డను ప్రసవించనున్నట్లు జియా పావల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్

పైలట్ అప్రమత్తంగా ఉండటం వల్ల అబుదాబి నుంచి కేరళలోని కోజికోడ్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వినామానికి పనుప్రమాదం తప్పింది.

కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ విడుదల, రెండేళ్లుగా జైలులోనే

2020లో తీవ్రవాద ఆరోపణలపై అరెస్టయిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ గురువారం విడుదలయ్యారు. వాస్తవానికి గతేడాది డిసెంబరులోనే బెయిల్ లభించినా రిలీజ్ చేయలేదు. తాజాగా లక్నో సెషన్స్ కోర్టు ఆయన విడుదలపై సంతకం చేసింది.

కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కొడుకు అనిల్ ఆంటోనీ పార్టీకి రాజీనామా చేశారు.

ఇక ఉపాధ్యాయులను 'సార్', 'మేడమ్' అని పిలవరు, కేరళ పాఠశాలల్లో కొత్త ఒరవడి

పాఠశాలల్లో పాఠాలు బోధించే గురువును సంబంధించే అంశంపై కేరళ బాలల హక్కల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలో ఉపాధ్యాయుడిని 'సార్' అని, ఉపాధ్యాయురాలినిని మేడమ్ అని సంభోదించవద్దని పేర్కొంది. పాఠశాలల్లో ఈ రెండు పదాలకు బదులుగా ఇద్దరినీ 'టీచర్' అని సంబోధించాలని సూచించింది.

కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా?

కేరళ గురువాయూర్ ఆలయ ఆస్తులపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఆలయం పరిధిలో ఎన్ని రూ. కోట్ల డిపాజిట్లు ఉన్నాయి? ఎంత భూమి ఉంది? అనేది బయటి ప్రపంచానికి తెలియదు. అయితే ఇప్పుడు ఆ విషయం బయటికి వచ్చింది.

ఆపరేషన్ 'పీఎఫ్ఐ'.. కేరళ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు

అతివాద, నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను లక్ష్యంగా చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం తెల్లవారుజామున కేరళ వ్యాప్తంగా సోదాలు చేపట్టింది. రాష్ట్రంలో దాదాపు 56చోట్ల ఎన్‌ఐఏ దాడులు చేస్తోంది.