
F 35B Fighter Jet: తిరువనంతపురంలో నిలిచిన బ్రిటన్ ఎఫ్-35.. 10 రోజులుగా రన్వే పైనే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల్లో ఒకటైన బ్రిటన్ ఎఫ్-35బీ (F-35B) ఫైటర్ జెట్ ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉంది. సాంకేతిక సమస్య కారణంగా ల్యాండ్ అయిన ఈ జెట్ 10 రోజులుగా భారత్లో నిలిచిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ బ్రిటిష్ యుద్ధ విమానానికి సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిరంతరం భద్రత కల్పిస్తున్నారు. ఆ జెట్ లోపం ఏంటని, అది ఇంత కాలం భారత్లో ఎందుకు చిక్కుకుపోయింది అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. గత 10 రోజులుగా తిరువనంతపురం ఎయిర్పోర్ట్ రన్వే పక్కన ఈ జెట్ పార్క్ చేసి ఉంచారు. దాన్ని హ్యాంగర్ కు తరలించాలని భారత్ చేసిన విజ్ఞప్తిని బ్రిటన్ నేవీ(UK Navy) సున్నితంగా తిరస్కరించింది.
Details
జూన్ 14న తిరువనంతపురంలో ల్యాండ్
ఫైటర్ జెట్ సాంకేతికతకు సంబంధించిన భద్రతా అంశాలపై ఉన్న ఆందోళనల కారణంగానే ఈ ప్రతిపాదనని బ్రిటన్ నేవీ అంగీకరించకపోయినట్టు తెలుస్తోంది. అయితే తుది తనిఖీల సమయంలో మాత్రం దీన్ని హ్యాంగర్ కు తరలించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. ఇక ఇటీవలే బ్రిటన్ దేశానికి చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ (HMS Prince of Wales) క్యారియర్ ఇండో-పసిఫిక్ రీజియన్ లో భారత నేవీతో కలిసి సంయుక్త యుద్ధ విన్యాసాల్లో పాల్గొంది. ఆ నౌకలోని ఎఫ్-35 ఫైటర్ జెట్ ఇంధనం తగ్గడంతో జూన్ 14న తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని మొదట్లో వార్తలు వచ్చాయి.
Details
సాంకేతిక సమస్యే కారణం
కానీ ఇప్పుడు మాత్రం సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలిసింది. ఫైటర్ జెట్ లోపాన్ని సరిచేసిన తర్వాత దీన్ని మళ్లీ హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నౌకపైకి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫైటర్ జెట్ కు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తోంది. భారత్లో ఒక విదేశీ యుద్ధ విమానం అంతకంతకే 10 రోజుల పాటు నిలిచిపోవడం, ముఖ్యంగా ఎఫ్-35 లాంటి 5వ తరం స్టెల్త్ జెట్ మోరాయించడం అనేది అసాధారణమే. షార్ట్ టేకాఫ్తో పాటు వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యంతో ఉన్న ఈ యుద్ధ విమానం అమెరికా సహా కొద్ది దేశాల ఎయిర్ఫోర్స్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ కూడా దీని మరో వేరియంట్ ను ఇరాన్ పై దాడులకు వినియోగిస్తోందని సమాచారం.