NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అమెరికా ఆపిల్స్‌పై సుంకాన్ని తగ్గించండపై ప్రియాంక గాంధీ విమర్శలు.. కేంద్రం వివరణ 
    తదుపరి వార్తా కథనం
    అమెరికా ఆపిల్స్‌పై సుంకాన్ని తగ్గించండపై ప్రియాంక గాంధీ విమర్శలు.. కేంద్రం వివరణ 
    అమెరికా ఆపిల్స్‌పై సుంకాన్ని తగ్గించండపై ప్రియాంక గాంధీ విమర్శలు.. కేంద్రం వివరణ

    అమెరికా ఆపిల్స్‌పై సుంకాన్ని తగ్గించండపై ప్రియాంక గాంధీ విమర్శలు.. కేంద్రం వివరణ 

    వ్రాసిన వారు Stalin
    Sep 13, 2023
    10:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా ఆపిల్స్, వాల్‌నట్‌లు, బాదంపప్పులపై అదనపు సుంకాలు ఎత్తివేతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

    ఈ నిర్ణయం దేశీయ ఆపిల్, వాల్‌నట్, బాదం ఉత్పత్తిదారులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని పేర్కొంది.

    ఆయా దిగుమతులపై 20శాతం సుంకం మాత్రమే ఎత్తివేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

    అమెరికా ఆపిల్స్‌పై 50శాతం, వాల్‌నట్‌లపై 100 శాతం సుంకం అలాగే ఉంటుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.

    అంతకుముందు అమెరికా ఆపిల్స్‌పై సుంకాలను తగ్గించడంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కేంద్రంపై తీవ్రమైన విమర్శలు చేశారు.

    అమెరికా ఆపిల్‌పై అదనపు దిగుమతి సుంకాలను కేంద్రం తగ్గించిందని, తద్వారా దేశంలోని ఆపిల్ రైతులకు కాకుండా అమెరికాలోని ఆపిల్ పెంపకందారులకు ప్రభుత్వం సహాయం చేస్తోందని ప్రియాంక గాంధీ విమర్శించారు.

    కేంద్రం

    హిమాచల్ ప్రదేశ్ రైతులకు సాయం చేస్తారా? అమెరికా రైతులకా?

    హిమాచల్ ప్రదేశ్‌లో వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రియాంక గాంధీ వెళ్లారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు.

    అమెరికా నుంచి వచ్చే ఆపిల్స్‌పై కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించడం అనేది రాష్ట్రంలోని రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు.

    దీని వల్ల అమెరికన్ ఆపిల్స్ దిగుమతి సులభతరం అవుతుందని, సులభంగా అమ్ముడవుతాయని చెప్పారు.

    సిమ్లాలో ఆపిల్స్ సేకరణ ధరలను బడా పారిశ్రామికవేత్తలు తగ్గించారని, ఇక్కడి రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి సాయం చేస్తారా? అమెరికా రైతులకు సాయం చేస్తారా? అని ప్రియాంక ప్రశ్నించారు.

    కేంద్రం

    అమెరికా-భారత్ పరస్పర ఒప్పందం వల్లే అదనపు సుంకాలు ఎత్తివేత: కేంద్రం

    అదనపు సుంకాల తొలగింపు వల్ల ఆపిల్స్, వాల్‌నట్‌లు, బాదంపప్పుల దేశీయ ఉత్పత్తిదారులకు ఎలాంటి నష్టం కలిగించదని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.

    పైగా దీని వల్ల ప్రీమియం మార్కెట్ విభాగంలో నాణ్యమైన దేశీయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ లభిస్తుందని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

    రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే అదనపు సుంకాలను ఎత్తివేసినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

    అమెరికా ప్రభుత్వం కూడా భారతీయ ఉత్పత్తులపై విధించిన అదనపు సుంకాలను తొలగించారని, బదులుగా భారత్ కూడా అదే పని చేసినట్లు గోయల్ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రియాంక గాంధీ
    కేంద్ర ప్రభుత్వం
    వాణిజ్యం
    ఆపిల్

    తాజా

    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి
    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  16 మంది  మృతి  చార్మినార్

    ప్రియాంక గాంధీ

    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  నరేంద్ర మోదీ
    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ  కాంగ్రెస్
    నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్ హైదరాబాద్
    కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ  కర్ణాటక

    కేంద్ర ప్రభుత్వం

    ఏపీ, బాంబే హైకోర్టులకు కొత్త సీజేలు.. కొలిజీయం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం ఆంధ్రప్రదేశ్
    రూ.2 వేల నోట్ల మార్పిడిపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన ఆర్థిక శాఖ మంత్రి
    ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలి: కేంద్రం  హోంశాఖ మంత్రి
    భారత వాతావరణ అంచనా వ్యవస్థలు ప్రపంచంలోనే భేష్  : కిరణ్ రిజిజు కేంద్రమంత్రి

    వాణిజ్యం

    డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం  జో బైడెన్
    PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Basmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు  కేంద్ర ప్రభుత్వం
    కారణం చెప్పకుండానే.. భారత్‌తో వాణిజ్య చర్చలను నిలివేసిన కెనడా  కెనడా

    ఆపిల్

    చౌకైన ఎయిర్‌పాడ్స్ AirPods Lite లాంచ్ చేసే ఆలోచనలో ఆపిల్ ధర
    భారతదేశంలో త్వరలో రిటైల్ స్టోర్లను తెరవనున్న ఆపిల్ సంస్థ భారతదేశం
    ఆపిల్ AR/VR హెడ్‌సెట్ గురించి తెలుసుకుందాం ధర
    భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ ఆండ్రాయిడ్ ఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025