LOADING...
Haryana: వ్యవసాయం నుంచి విద్య వరకు... ఏఐ విప్లవం
వ్యవసాయం నుంచి విద్య వరకు... ఏఐ విప్లవం

Haryana: వ్యవసాయం నుంచి విద్య వరకు... ఏఐ విప్లవం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2026
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక గ్రామం ఇది.పొలంమధ్య నిలిపిన ట్రాక్టర్‌ స్టీరింగ్‌కు ఒక ఐప్యాడ్‌ను అమర్చారు. రైతు బిర్‌ విర్క్‌ ఆ ఐప్యాడ్‌ను ఆన్‌ చేసి ట్రాక్టర్‌ను ఆటోమేటిక్‌ విధానంలోకి మార్చారు. అంతే...ఎవరూ నియంత్రించకుండానే ట్రాక్టర్‌ స్వయంగా ముందుకు సాగుతూ పొలంలో పండిన బంగాళాదుంపలను సేకరిస్తూ తన పనిని కొనసాగిస్తోంది. కర్నాల్‌కే చెందిన శ్వేతాంక్‌ పాండే అనే కోచ్‌ కూడా ఇదే తరహా ఆటోమేటెడ్‌ సాంకేతిక పరికరాన్ని వినియోగిస్తున్నారు. ఆయన విద్యార్థుల పరీక్ష పత్రాల మూల్యాంకనానికి ఈ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఆల్గారిథమ్‌ ఆధారంగా పనిచేసే ఈ పరికరం సమాధాన పత్రాలను స్కాన్‌ చేసి,పరిశీలించి,తగిన గ్రేడులు కేటాయిస్తుంది. ఈరెండు సందర్భాల్లోనూ కనిపించకుండా పనిచేస్తున్న ప్రధాన శక్తి కృత్రిమ మేధస్సు (ఏఐ).

వివరాలు 

విద్యార్థుల పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయడంలో ఏఐ సహాయం 

అమెరికాలో విద్యనభ్యసించిన బిర్‌ విర్క్‌ స్వీడన్‌కు చెందిన ఒక సంస్థ నుంచి ఈ సాంకేతికతను దిగుమతి చేసుకున్నారు. గత రెండేళ్లుగా ఆయన ఈ విధానంతో వ్యవసాయాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు,సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నశ్వేతాంక్‌ పాండేకు పెద్దఎత్తున వచ్చే విద్యార్థుల పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయడంలో ఏఐ ఎంతో సహాయపడుతోంది. దీంతో మూల్యాంకన ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు సులభమైంది.

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు వినియోగం

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు వినియోగం వేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో కూడా వ్యాపార స్టార్టప్‌ల నుంచి వ్యక్తిగత అవసరాల వరకూ దీని ఉపయోగం పెరుగుతోంది. దాదాపు వంద కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులతో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్నడిజిటల్‌ మార్కెట్లలో భారత్‌ ఒకటి. ఈ నేపథ్యంలో తమ వ్యాపారాలను విస్తరించేందుకు అనేక సంస్థలు భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.

Advertisement